రిపబ్లిక్ డే పరేడ్: అమ్మకానికి 32వేల టికెట్లు, ఆన్లైన్లోనే అందరికీ ఆహ్వానాలు
న్యూఢిల్లీ: భారత గణతంత్ర వేడుకలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సంవత్సరం రిపబ్లిక్ డే వేడుకలు పునరుద్ధరించబడిన సెంట్రల్ విస్టా అవెన్యూలో జరుగనున్నాయి. ప్రభుత్వం ప్రజల కోసం ఆన్లైన్లో 32,000 టిక్కెట్లను విక్రయించినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ అధికారులు బుధవారం వెల్లడించారు.
అంతేగాక, తొలిసారిగా ఈ వేడుకకు సంబంధించిన అధికారిక ఆహ్వానాలను ఆన్లైన్లో పంపనున్నట్లు అధికారులు తెలిపారు. గత సంవత్సరం రాజ్పథ్ పేరును కర్తవ్య పథ్ గా మార్చిన తర్వాత సెరిమోన్గియల్ బౌలేవార్డ్ లో నిర్వహించబడుతున్న తొలి రిపబ్లిక్ డే వేడుకలు ఇవే.

గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా జనవరి 23-31 తేదీల మధ్య జరిగే వేడుకలపై బుధవారం రక్షణ శాఖ కార్యదర్శి గిరిధర్ అరమనే సౌత్ బ్లాక్లో మీడియాకు ప్రజెంటేషన్ ఇచ్చారు.
గణతంత్ర దినోత్సవ వేడుకలు జనభాగధారి(ప్రజల భాగస్వామ్యం) స్ఫూర్తితో జరుగుతాయి. సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ కార్మికులు, వారి కుటుంబసభ్యులు, కర్తవ్య మార్గంలోని నిర్వహణ కార్మికులు, కూరగాయల విక్రేతలు, మిల్క్ బూత్ కార్మికులు, కిరాణా దుకాణదారులు, రిక్షా పుల్లర్లు పాల్గొంటుండటం గమనార్హం. ప్రజెంటేషన్ సమయంలో అధికారులు ప్రత్యేక ఆహ్వానితులుగా ఉంటారు.
-
భారత పారిశ్రామిక వృద్ధి రేటు తగ్గుదల.. యుద్ధం కంటే ముందే..! -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు












Click it and Unblock the Notifications