రిపబ్లిక్ డే పరేడ్: అమ్మకానికి 32వేల టికెట్లు, ఆన్లైన్లోనే అందరికీ ఆహ్వానాలు
న్యూఢిల్లీ: భారత గణతంత్ర వేడుకలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సంవత్సరం రిపబ్లిక్ డే వేడుకలు పునరుద్ధరించబడిన సెంట్రల్ విస్టా అవెన్యూలో జరుగనున్నాయి. ప్రభుత్వం ప్రజల కోసం ఆన్లైన్లో 32,000 టిక్కెట్లను విక్రయించినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ అధికారులు బుధవారం వెల్లడించారు.
అంతేగాక, తొలిసారిగా ఈ వేడుకకు సంబంధించిన అధికారిక ఆహ్వానాలను ఆన్లైన్లో పంపనున్నట్లు అధికారులు తెలిపారు. గత సంవత్సరం రాజ్పథ్ పేరును కర్తవ్య పథ్ గా మార్చిన తర్వాత సెరిమోన్గియల్ బౌలేవార్డ్ లో నిర్వహించబడుతున్న తొలి రిపబ్లిక్ డే వేడుకలు ఇవే.
గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా జనవరి 23-31 తేదీల మధ్య జరిగే వేడుకలపై బుధవారం రక్షణ శాఖ కార్యదర్శి గిరిధర్ అరమనే సౌత్ బ్లాక్లో మీడియాకు ప్రజెంటేషన్ ఇచ్చారు.
గణతంత్ర దినోత్సవ వేడుకలు జనభాగధారి(ప్రజల భాగస్వామ్యం) స్ఫూర్తితో జరుగుతాయి. సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ కార్మికులు, వారి కుటుంబసభ్యులు, కర్తవ్య మార్గంలోని నిర్వహణ కార్మికులు, కూరగాయల విక్రేతలు, మిల్క్ బూత్ కార్మికులు, కిరాణా దుకాణదారులు, రిక్షా పుల్లర్లు పాల్గొంటుండటం గమనార్హం. ప్రజెంటేషన్ సమయంలో అధికారులు ప్రత్యేక ఆహ్వానితులుగా ఉంటారు.