స్నేహితుడి భార్యను రేప్ చేసి చంపేశాడు
కాన్పూర్: ఉత్తరప్రదేశ్ లో రోజు రోజుకు అత్యాచారాలు, హత్యలు పెరిగిపోతున్నాయి. కుటుంబ సభ్యులతో సన్నిహితంగా ఉండే వారు సైతం అత్యాచారం చేసి దారుణంగా చంపేస్తున్నారు. చిన్ననాటి స్నేహితుడి భార్య మీద అత్యాచారం చేసి కిరోసిన్ పోసి నిప్పంటించి చంపేశాడు.
కాన్పూర్ లో 35 సంవత్సరాల మహిళ నివాసం ఉంటున్నది. ఈమె భర్త చిన్ననాటి స్నేహితుడు దినేష్. దినేష్ నిత్యం వారి ఇంటికి వచ్చి వెళ్లేవాడు. మహిళ భర్తకు దినేష్ మీద అనుమానం రాలేదు. స్నేహితుడి భార్య మీద కన్నేసిన దినేష్ ఎలాగైనా ఆమెను అనుభవించాలని భావించాడు.

దినేష్ పిప్రీ ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. జూన్ 25వ తేదిన స్నేహితుడు ఇంటిలో లేని విషయం తెలుసుకుని అక్కడికి వెళ్లాడు. తరువాత స్నేహితుడి భార్య మీద కనికరం లేకుండ అత్యాచారం చేశాడు. ఆమె విషయం బయటకు చెబుతుందని భయపడ్డాడు.
చివరికి కిరోసిన్ తీసుకుని ఆమె మీద పోసి నిప్పంటించి అక్కడి నుండి పరారైనాడు. 80 శాతం కాలిపోయిన మహిళ ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడి శుక్రవారం మరణించిందని పోలీసులు తెలిపారు. అత్యాచారం, హత్య చేసి పరారైన దినేష్ కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications