బ్లాక్ ఫంగల్ ఇన్ ఫెక్షన్ కలకలం.. పెరుగుతోన్న కేసులు, ఆందోళన
అసలే కరోనా కలవర పెడుతుంటే.. ఇటు బ్లాక్ ఫంగల్ మరింత ఆందోళనకు గురిచేస్తోంది. కేసులు కూడా క్రమంగా పెరుగుతున్నాయి. తొలి దశలో చికిత్స తీసుకుంటే ఓకే.. లేదంటే సీరియస్ అయ్యే అవకాశం ఉంది. కాగా శుక్రవారం మరో నాలుగు బ్లాక్ ఫంగల్ ఇన్ ఫెక్షన్ కేసులు వచ్చాయి. దీంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. దీని నివారణ కోసం నడుం బిగించాలని మేధావులు కోరుతున్నారు.
మధ్యప్రదేశ్లో బ్లాక్ ఫంగల్ ఇన్ఫెక్షన్ కేసులు భయాందోళనకు గురి చేస్తున్నాయి. గత రెండు రోజులలో దామో జిల్లాలో ముకోర్మైకోసిస్ అనే నాలుగు బ్లాక్ ప్రాణాంతక కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు ఆరోగ్య అధికారి తెలిపారు. జిల్లా చీఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సంగీత త్రివేది మాట్లాడుతూ నలుగురు రోగులను చికిత్స కోసం ఇతర జిల్లాకు పంపినట్లు చెప్పారు. రోగులకు చికిత్స చేయడానికి అవసరమైన యాంఫోటెరిసిన్ బి ఇంజెక్షన్ అందుబాటులో లేదని వైద్యులు తెలిపారు.
బ్లాక్ ఫంగల్ కేసుల విషయంలో చికిత్స కంపల్సరీ తీసుకోవాలి. లేదంటే అదీ ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉంది. 15 రోజులు దాటిపోతే 90 శాతం వరకు మరణాలు సంభవిస్తాయట. ఈ విషయాన్ని వైద్య నిపుణులు తెలియజేశారు. ముందే జాగ్రత్త పడి ట్రీట్ మెంట్ తీసుకోవాలని కోరుతున్నారు.