Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కాల్పులకు తెగబడ్డ మావోయిస్టులు: నలుగురు పోలీసులు మృతి

రాంచీ: జార్ఖండ్ రాష్ట్రంలోని లతేహర్ జిల్లాలో దారుణానికి తెగబడ్డారు. నక్సల్స్ జరిపిన దాడిలో నలుగురు పోలీసులు మృతి చెందారు. శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది.

శుక్రవారం రాత్రి చంద్వా పోలీస్ స్టేషన్ పరిధిలోని లుకియతాండ్ గ్రామం సమీపంలో పెట్రోల్ వ్యాన్‌పై సాయుధులైన మావోయిస్టులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో నలుగురు పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. వారిలో అసిస్టెంట్ సబ్‌ఇన్ స్పెక్టర్ కూడా ఉన్నారు.

 4 cops killed in Naxal attack in Latehar

మృతుల్లో ఏఎస్ఐ సుక్రా ఓరయన్, హోంగార్డ్ జవాన్లు సికందర్ సింగ్, జమున ప్రసాద్, శంభు ప్రసాద్ ఉన్నారని ఓ పోలీసు అధికారి తెలిపారు. ఈ ఘటనపై జార్ఖండ్ ముఖ్యమంత్రి రఘువర్ దాస్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మావోయిస్టుల దాడిని తీవ్రంగా ఖండించారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు.

ఈ దాడి ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆ ప్రాంతంలో కూంబింగ్ చేపడుతున్నారు. జార్ఖండ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మావోయిస్టులు ఇలా దాడులకు పాల్పడటంతో ఆ ప్రాంత ప్రజల్లో ఆందోళన నెలకొంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+