41 కోట్ల మందికి వ్యాక్సిన్.. ఫస్ట్ డోసే ఎక్కువ... సెకండ్ డోస్ లెక్క ఇదీ
కరోనా వైరస్కు విరుగుడు వ్యాక్సిన్.. తొలినాళ్లలో టీకాపై అవగాహన తక్కువగా ఉండేది. కానీ ఆ తర్వాత అందరూ టీకా వేసుకుంటున్నారు. అయితే దేశంలో చాలా మంది అంటే 417 మిలియన్ల మంది వ్యాక్సిన్ తీసుకున్నారు. నిన్న రాత్రి 7 గంటల వరకు 41.7 కోట్ల మంది వ్యాక్సిన్ తీసుకున్నారు. ఒక్కరోజే 20 లక్షల మంది టీకా తీసుకున్నారు.
18 నుంచి 45 ఏళ్ల లోపు వారికి 10 లక్షల మందికి ఫస్ట్ డోస్.. 95 వేల 964 మందికి సెకండ్ ోస్ ఇచ్చారు. అలాగే 13 కోట్ల మంది ఫస్ట్ డోస్, 53 లక్షల మంది సెకండ్ డోస్ తీసుకున్నారు. 18-45 ఏళ్ల లోపు వారికి సంబంధించి మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్ 10 మిలియన్ వ్యాక్సిన్ల చొప్పున వేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్, అసోం, చత్తీస్ గడ్, డిల్లీ, హర్యానా, జార్ఖండ్, కేరళ, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్, ఒడిశా, పంజాబ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్లో మిలియన్ డోసుల వ్యాక్సిన్ తీసుకున్నారు.
Recommended Video
వేసవిలోనే కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటోంది. గతేడాది సమ్మర్లో కరోనా ఇంపాక్ట్ ఎక్కువగానే ఉంది. ఈ సారి సెకండ్ వేవ్ వల్ల యువత పిట్టల్లా రాలిపోయారు. థర్డ్వేవ్ పిల్లలకు అని ప్రచారం జరుగుతోంది. వచ్చే నెలలో అని నిపుణులు చెబుతున్నారు. దీంతో ఆందోళన నెలకొంది. మరోవైపు వచ్చే ఏడాది సమ్మర్లో ఫోర్త్ వేవ్ అని కూడా అంటున్నారు. దీంతో కరోనా 5,6 ఏళ్లు ఉంటుందని అర్థం చేసుకోవచ్చు.
వానకాలం రావడంతో ఫంగస్ ఇంపాక్ట్ తగ్గుతుందని వైద్యులు సూచిస్తున్నారు. ఇప్పటివరకు బ్లాక్ ఫంగస్ ఇంపాక్ట్ కనిపించింది. మొత్తానికి కరోనాతో కలిసి బతకాల్సిందే.. అందుకోసం విధిగా మాస్క్ ధరించి.. శానిటైజర్ రాసుకుంటూ కాలం వెళ్లదీయాల్సిందే.