వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మోడీ క్యాబినెట్లో 5గురు మహిళ మంత్రులు... మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయని సుష్మా,
కేంద్రంలో రెండవ సారీ కొలువుదీరిన నరేంద్రమోడీ ప్రభుత్వంలో మొత్తం 58 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే అందులో 5గురు మహిళ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. కాగా ప్రమాణ స్వీకారం చేసిన మహిళల్లో ,గత ప్రభుత్వంలో డిఫెన్స్ మినిస్టర్గా బాధ్యతలు చేపట్టిన నిర్మల సీతారామన్, మరో మంత్రి స్మృతి ఇరాని,కాగా పశ్చిమ బెంగాల్ నుండి గెలిచిన డిబేశ్రీ చౌదరీ, పంజాబ్ నుండి హర్స్మీత్ కౌర్ బాదల్ , నిరంజన్ జ్యోతీ లు ప్రమాణ స్వీకారం చేశారు.
గత ప్రభుత్వంలో విదేశీ వ్యవహారలు చూసిన సుష్మా స్వరాజ్ మాత్రం మొదటి దఫ చేపట్టిన క్యాబినెట్లో ప్రమాణ స్వీకారం చేయలేదు. కాగా అంతుకు ముందు ప్రధాని మోడీ ఇచ్చిన తేనీటి విందుకు కూడ ఆమే హజరుకాలేదు. కాగా మిత్రపక్షమైన జేడీయు కూడ కేంద్రంలో మంత్రి పదవులు చేపట్టలేదు.
Comments
English summary
All 58 ministers were sworn in in the Narendra Modi government in the second term of the Center. But in the modi team 5 women members were sworn as ministers.
Story first published: Thursday, May 30, 2019, 21:20 [IST]