Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ముస్లీం వ్యాపారుల బహిష్కరణ, మీరు వద్దు, మీ వ్యాపారం వద్దని పోస్టర్లు !

హరియాణ/గురుగ్రామ్: జులై 31న హరియాణలోని నుహ్‌లో జరిగిన ఘర్షణల తర్వాత రేవారీ, మహేందర్‌గఢ్, ఝజ్జర్ మూడు జిల్లాల్లోని 50 పంచాయతీలు వారి గ్రామాల్లోకి ముస్లిం వ్యాపారుల ప్రవేశాన్ని నిషేధిస్తూ లేఖలు జారీ చేపి పోస్టర్లు వెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది. గత కొద్ది రోజులుగా దాదాపు 50కి పైగా పంచాయతీలు వారివారి గ్రామాల్లో ముస్లిం వ్యాపారుల ప్రవేశాన్ని నిషేధిస్తూ ఇలాంటి లేఖలు జారీ చేశాయి.

గ్రామాల్లో నివసిస్తున్న ముస్లింలు తమ గుర్తింపు పత్రాలను పోలీసులకు సమర్పించాలని సర్పంచ్‌ల సంతకాలతో కూడిన లేఖల్లో రాసి ఉంది. ఎవరి మత మనోభావాలను దెబ్బతీయాలనే ఉద్దేశం మాకు లేదని లేఖలో రాశారు. ఇలాంటి లేఖలు జారీ చేయడం చట్ట విరుద్ధం. కానీ పంచాయతీల నుంచి మాకు ఎలాంటి లేఖలు రాలేదు. ఈ విషయాన్ని మీడియా, సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్నాను అని కొందరు అంటున్నారు.

 panchayats

ఈ గ్రామాల్లో మైనార్టీ జనాభా 2% కూడా లేదు. అందరూ సామరస్యంగా జీవిస్తున్నారని, అలాంటి సూచన సామరస్యానికి విఘాతం కలిగిస్తుందని ఓ ముస్లీం వ్యాపారి అంటున్నారు. దీనిపై సైద్‌పూర్, మహేందర్‌ఘర్ సర్పంచ్ వికాస్ మాట్లాడుతూ, గ్రామంలో గత జూలైలో అనేక దొంగతనం కేసులు నమోదయ్యాయి. అవాంఛనీయ సంఘటనలన్నీ బయటి వ్యక్తుల తర్వాత మాత్రమే జరగడం ప్రారంభించాయని అన్నారు.

నుహ్ ఘర్షణ తర్వాత, మేము ఆగస్టు 1 న మేము పంచాయితీ నిర్వహించామని, ప్రజల మనసులోని మాటలను, వారి అభిప్రాయాలను సేకరించామని, శాంతిని కాపాడటానికి ముస్లీం వ్యాపారులను మా గ్రామంలోకి అనుమతించకూడదని నిర్ణయించుకున్నామని అన్నారు. మతం ఆధారంగా వర్గాలను విభజించడం చట్ట విరుద్ధమని తన న్యాయవాది చెప్పడంతో లేఖను ఉపసంహరించుకున్నట్లు సర్పంచ్ వికాస్ తెలిపారు.

 panchayats

ఈ లేఖ సోషల్ మీడియాలో ఎలా వైరల్ అవుతుందో మాకు తెలియదు, మేము దానిని వెనక్కి తీసుకున్నాము అని సర్పంచ్ వికాస్ అంటున్నాడు. వికాస్ ఇచ్చిన సమాచారం ప్రకారం లేఖ జారీ చేసిన మొదటి గ్రామం సైద్‌పూర్, ఇతరులు దీనిని అనుసరించారు. మొత్తం 750 కుటుంబాలున్న ఈ గ్రామంలో మైనార్టీ కుటుంబాలు లేవు. అలాంటి ఆందోళన తమకు లేదని స్థానికులు కూడా చెప్పారు. మాకు సంబంధం లేని విషయాలపై మాకు ఆసక్తి లేదు అని గ్రామస్థుడు రోహ్తాస్ సింగ్ స్థానిక మీడియాకు చెప్పారు.

ఊరి గుడి ముందు ఓ చెట్టు కింద సంచాయితీ జరిగింది. మేము సరళమైన, ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నాము. నుహ్‌లో ఏమి జరుగుతుందో మాకు తెలుసు, కానీ ఇక్కడ మాకు ఎటువంటి మతపరమైన ఉద్రిక్తత లేదని, అభద్రతా భయం లేదని, అందరూ కలిసిమెలసి ఉంటున్నామని కొందరు గ్రామస్తులు అంటున్నారు.

అదే ప్రశ్న గ్రామ సర్పంచ్ రాజ్‌కుమార్ ను అడిగితే ఆయన ఇలా అన్నారు. నన్ను స్థానికంగా టైగర్ అని పిలుస్తారు. తనకు వికాస్ నుండి ఫోన్ కాల్ వచ్చింది. అందరూ లెటర్ ఇచ్చారు, నేను కూడా ఇవ్వాలి అని అన్నాడు. ఇది ముందు జాగ్రత్త చర్య అని, నాకు ఎలాంటి హాని జరగలేదని, వారు ఇచ్చిన లేఖ టెంప్లేట్ మా వద్ద ఉందని, దానిని కాపీ చేశామని రాజ్‌కుమార్ తెలిపారు.

 panchayats

గ్రామంలో సుమారు 80 మంది ముస్లీం ఓటర్లు ఉన్నారని వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగి షాజేబ్ తెలిపారు. మాకు ఎప్పుడూ విభేదాలు లేవు. మతం మా స్నేహాన్ని ప్రభావితం చేయదు, మేము కలిసి పెరిగాము అని రాజ్ కుమార్ చెప్పాడు. కొందరు ముస్లీంలు పశువుల కోసం, ఇతర వ్యాపారాల కోసం తమ గ్రామానికి వస్తుంటారని, అయితే, నుహ్‌లో పరిస్థితి ఈ వ్యాపారాలను నిలిపివేసిందని అన్నారు.

ఈ ప్రాంతానికి చెందిన కొంతమంది ముస్లీంలు ఇక్కడ నివసించేవారని, కానీ వారు నుహ్‌లోని వారి కుటుంబాలకు తిరిగి వెళ్లారని రాజ్‌కుమార్ చెప్పారు. మొత్తం మీద హరియాణలోని కొన్ని జిల్లాలో ముస్లీం వ్యాపారులను గ్రామ బహిష్కరణ చెయ్యడం ఇప్పుడు ఆ జిల్లాల్లో హాట్ టాపిక్ అయ్యింది. అయితే ఈ విషయంలో అధికారులు మాత్రం మాకు ఎలాంటి ఫిర్యాదులు రాలేదని అంటున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+