ఆరేళ్ల చిన్నారిపై 50ఏళ్ల వ్యక్తి రేప్, మరోచోట 45ఏళ్ల వ్యక్తి
మహబూబ్ నగర్/న్యూఢిల్లీ: మహబూబ్ నగర్ జిల్లా ఆమనగల్లు మండలం పరిధిలో శనివారం రాత్రి దారుణం చోటు చేసుకుంది. రాత్రి తొమ్మిదిన్నర గంటల సమయంలో ఆరేళ్ల బాలిక పైన 50ఏళ్ల వయసుగల వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
గ్రామ కూడలిలో ఏర్పాటు చేసిన పీర్ల వద్దకు సాయంత్రం ఏడున్నర గంటల ప్రాంతంలో ఆ బాలిక సోదరితో కలిసి ఆడుకోవడానికి వెళ్లింది. ఆ తర్వాత చిన్నారి జాడ తెలియరాలేదు. దీంతో తల్లిదండ్రులు ఆమె కోసం వెతికారు. చివరకు రాత్రి తొమ్మిదిన్నర గంటల ప్రాంతంలో అదే గ్రామానికి చెందిన రఫీక్ చెట్ల పొదల నుండి బాలికను ఎత్తుకు రావడం గ్రామస్థులు చూశారు.
అతని వద్ద నుండి బాలికను లాక్కున్నారు. ఆమెను పరిశీలించారు. ఆ చిన్నారి మతిస్థిమితం కోల్పోయింది. తలకు, శరీరానికి ముళ్లు గుచ్చుకుని గాయాలు అయ్యాయి. చికిత్స నిమిత్తం వెంటనే ఆమనగల్లుకు తీసుకు వెళ్లారు. పరీక్షించిన వైద్యులు బాలిక పైన అత్యాచారం జరిగినట్లు గుర్తించారు.
ఆమె తల్లిదండ్రులు రాత్రి పదిన్నర గంటల సమయంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. రఫీక్ పైన అత్యాచార కేసు నమోదు చేసుకున్నారు. బాలికను కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గ్రామస్థులు నిందితుడిని పోలీసులకు అప్పగించారు.
రేపిస్ట్ను చంపిన తండ్రి
ఉత్తరాదిన ఓ తండ్రి తన కూతురు పైన అత్యాచారం చేసిన వ్యక్తిని హత్య చేశాడు. 14 ఏళ్ల ఆయన కూతురు పైన 45 ఏళ్ల వ్యక్తి కొన్నాళ్లుగా అత్యాచారం చేస్తున్నాడు. దీంతో ఆమె గర్భవతి అయింది. ఈ విషయం తల్లిదండ్రులకు తెలిసింది. దీంతో ఆగ్రహోద్రుడైన తండ్రి తన కూతురు పైన అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిని గల్లా పట్టుకొని నిలదీశాడు. ఈ క్రమంలో అతను మృతి చెందాడు. అతనిని పోలీసులు అరెస్టు చేశారు.