జగన్నాథుడి రథయాత్రలో హైఓల్టేజ్ షాక్- ఆరుమంది దుర్మరణం
అగర్తల: త్రిపురలో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. పూరీ జగన్నాథుడి రథయాత్రకు కొనసాగింపుగా చేపట్టిన ఉల్టా రథయాత్రలో విద్యుద్ఘాతం సంభవించింది. ఈ ఘటనలో ఆరుమంది భక్తులు దుర్మరణం పాలయ్యారు. పలువురు గాయపడ్డారు. వారిని హుటాహుటిన సమీప ఆసుపత్రికి తరలించారు. కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు చెబుతున్నారు.
Big sad event. Today, more than twenty people were electrocuted during Ulta Rath Yatra in Tripura. I express my condolences to the families of the deceased. pic.twitter.com/DNG34rYoNK
— Sushanta Sinha (@sushantasinha) June 28, 2023
త్రిపురలోని ఉనకోటి జిల్లా కుమార్ఘాట్లో ఈ సాయంత్రం ఈ దుర్ఘటన సంభవించింది. ఈ నెల 20వ తేదీన రథయాత్ర సందర్భంగా జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర విగ్రహాలను కుమార్ఘాట్కు తీసుకెళ్లారు. అక్కడ పూజలందుకున్న తరువాత ఇవ్వాళ మళ్లీ ఆలయానికి బయలుదేరడాన్ని ఉల్టా రథయాత్రగా పిలుస్తారు.

ఈ మధ్యాహ్నం కుమార్ఘాట్లో ఈ ఉత్సవాలు ఆరంభం అయ్యాయి. పెద్ద సంఖ్యలో భక్తులు ఇందులో పాల్గొన్నారు. సాయంత్రం 4:30 గంటల సమయంలో మార్గమధ్యలో రథం పైభాగం ప్రమాదవశాత్తు 133 కేవీ ఓల్టేజీ విద్యుత్ను సరఫరా చేసే హై-టెన్షన్ వైర్ను తాకింది. దీనితో భక్తులు విద్యుద్ఘాతానికి గురయ్యారు. ఆ వెంటనే మంటలు చెలరేగాయి.
ఈ ప్రమాదంలో ఆరుమంది వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలను కోల్పోయారు. మరో 15 మందికి కాలిన గాయాలయ్యాయి. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు వెల్లడించారు. ఫలితంగా మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం లేకపోలేదనే ఆందోళన వ్యక్తమౌతోంది.
ఈ ఘటన పట్ల ముఖ్యమంత్రి మాణిక్ సాహా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. నష్టపరిహారాన్ని ప్రకటించారు. సమాచారం అందిన వెంటనే రాజధాని అగర్తల నుంచి సంఘటన స్థలానికి బయలుదేరి వెళ్లారు. దీనిపై సమగ్ర విచారణకు ఆదేశించారు. రెండురోజుల్లోగా నివేదికను అందజేయాలని జిల్లా కలెక్టర్కు సూచించారు. ఈ క్లిష్ట సమయంలో రాష్ట్ర ప్రభుత్వం బాధిత కుటుంబాలకు అండగా ఉంటుందని పేర్కొన్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications