ఎన్నికల వేళ కోర్టుల్ని ప్రభావితం చేసే కుట్ర ! సీజేఐకి 600 మంది లాయర్ల లేఖ-మోడీ కౌంటర్
దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలకు ఏర్పాట్లు జరుగుతున్న వేళ జాతీయ స్ధాయిలో ప్రముఖులైన 600 మంది లాయర్లు ఇవాళ సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ కు ఓ లేఖ రాశారు. ఇందులో లాయర్లు ఎన్నికల వేళ న్యాయవ్యవస్ధపై ఒత్తిడి తెచ్చి కోర్టు తీర్పును ప్రభావితం చేసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. దీనిపై వెంటనే జోక్యం చేసుకోవాలని సీజేఐని కోరారు. ఈ లేఖపై స్పందించిన ప్రధాని మోడీ.. ఎక్స్ లో కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేశారు.
దేశంలో ఓ స్వార్ధ ప్రయోజనాల కూటమి ఎన్నికల వేళ న్యాయవ్యవస్ధను ప్రభావితం చేసేందుకు, అపఖ్యాతి పాలు చేసేందుకు తమ పనికిమాలిన వ్యూహాలతో, కాలం చెల్లిన రాజకీయ అజెండాలతో ప్రయత్నిస్తోందంటూ 600 మంది లాయర్లు సీజేఐకి రాసిన లేఖలో ఆరోపించారు. వారి చేష్టలు న్యాయవ్యవస్థ పనితీరుపై విశ్వాసం, సామరస్య వాతావరణాన్ని దెబ్బతీస్తున్నాయని విమర్శించారు. రాజకీయ కేసులలో వారి ఒత్తిడి వ్యూహాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయన్నారు.

ముఖ్యంగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజకీయ ప్రముఖులు తమ కోర్టుల్ని దెబ్బతీస్తున్నారన్నారు. తద్వారా ప్రజాస్వామ్య వ్యవస్థకు ముప్పుగా మారారన్నారు. వీరు వివిధ మార్గాల్లో పనిచేస్తున్నారని, కోర్టుల యొక్క ప్రస్తుత తీర్పుల్ని గతంలో పనితీరుకు లింక్ చేస్తూ తప్పుడు కథనాలను సృష్టిస్తున్నారని లాయర్లు ఆరోపించారు. ఇవి కోర్టు నిర్ణయాలను అడ్డం పెట్టుకుని కొన్ని రాజకీయ ప్రయోజనాల కోసం కోర్టులను ఇబ్బంది పెట్టేందుకు ఉద్దేశపూర్వకంగా చేస్తున్న పనులుగా అభివర్ణించారు.
ఇందులో భాగంగా కొందరు లాయర్లు పగలు రాజకీయ నేతలకు మద్దతుగా కోర్టుల్లో వాదిస్తారని, రాత్రి మీడియాను అడ్డంపెట్టుకుని న్యాయమూర్తుల్ని ప్రభావితం చేస్తున్నారని ఆరోపించారు. అలాగే తమకు కావాల్సిన బెంచ్ లను ఎంచుకుని బెంచ్ ఫిక్సింగ్ కు కూడా పాల్పడుతున్నారని, ఇది న్యాయవ్యవస్ధ ప్రతిష్టకే మచ్చతెచ్చేలా ఉందని లాయర్లు ఆరోపించారు. అలాగే ఎలాంటి చట్టబద్ధపాలన లేని దేశాల్లో కోర్టులతో మన కోర్టుల్ని పోల్చే స్దాయికి దిగజారారని విమర్శించారు. ఇది కచ్చితంగా ప్రజల్లో మన న్యాయవ్యవస్ధపై ఉన్న నమ్మకాన్ని పొగొట్టే కుట్రేనన్నారు. దీనిపై స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని సీజేఐని కోరారు.
To browbeat and bully others is vintage Congress culture.
— Narendra Modi (@narendramodi) March 28, 2024
5 decades ago itself they had called for a "committed judiciary" - they shamelessly want commitment from others for their selfish interests but desist from any commitment towards the nation.
No wonder 140 crore Indians… https://t.co/dgLjuYONHH
అయితే ఇందులో వారు పేర్కొన్న స్వార్ధ ప్రయోజనాల కూటమి ఎవరన్న దానిపై స్పష్టత లేదు. అయితే ఇది కేంద్రంంలో అధికారంలో బీజేపీని ఉద్దేశించి వారు ఈ లేఖ రాసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోడీ ఈ లేఖపై ఘాటుగా స్పందించారు. ఇతరులను బుజ్జగించడం, వేధించడం పాతకాలపు కాంగ్రెస్ సంస్కృతి అని, 5 దశాబ్దాల క్రితమే వారు "నిబద్ధత గల న్యాయవ్యవస్థ" కోసం పిలుపునిచ్చారని, వారు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఇతరుల నుండి నిబద్ధతను సిగ్గు లేకుండా కోరుకుంటారు కానీ దేశం పట్ల ఎటువంటి నిబద్ధతకు దూరంగా ఉన్నారని, 140 కోట్ల మంది భారతీయులు వాటిని తిరస్కరించడంలో ఆశ్చర్యం లేదంటూ మోడీ ఎక్స్ లో పోస్టు చేశారు.
-
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..!












Click it and Unblock the Notifications