వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాక్‌లో భారీ భూకంపం: ఢిల్లీలో స్వల్ప ప్రకంపనలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ/ఇస్లామాబాద్: పాకిస్తాన్‌లోని బెలూచిస్తాన్ ప్రాంతంలో మంగళవారం భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంపం కారణంగా మన దేశంలోనూ పలు ప్రాంతాల్లో ప్రకంపనలు వచ్చాయి. బెలూచిస్తాన్ ప్రాంతంలో రిక్టర్ స్కేలు పైన దాని తీవ్రత 7.8గా నమోదయింది.

పాక్‌లోని సింద్ రాష్ట్రంలోని కరాచీ, హైదరాబాద్, లర్కానా, మరికొన్ని పట్టణాలలో ఈ భూమి కంపించింది. కరాచీ పట్టణంలో ప్రజలు అరుచుకుంటూ భవనాల నుండి బయటకు వచ్చారు. ఇది చాలా శక్తివంతమైన భూకంపంగా యుఎస్ జియలాజికల్ సర్వే వారు తెలిపారు.

7.8 magnitude quake hits Pakistan, tremors felt in Delhi

దాల్‌బండిన్‌కు సౌత్ ఈస్ట్ ప్రాంతంలో 145 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంపం వచ్చిన ప్రాంతం ఉంది.

బెలూచిస్తాన్‌లోని భూకంపం కారణంగా మన దేశ రాజధాని న్యూఢిల్లీలో భూమి స్వల్పంగా కంపించింది. పదిహేను సెకన్ల పాటు ఇది కంపించింది. దీంతో ప్రజలు ఇళ్లలో నుండి బయటకు పరుగులు తీశారు.

English summary
An strong earthquake struck a remote western Pakistan region on Tuesday and was felt in New Delhi and the NCR region where buildings shook.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X