అరుణాచల్ ప్రదేశ్లో భారీగా హిమపాతం.. ఏడుగురు సైనికులు గల్లంతు
అరుణాచల్ ప్రదేశ్లో భారీగా హిమపాతం కురుస్తోంది. కమెంగ్ సెక్టార్లో కొండ చరియలు విరిగిపడ్డాయి ఈ సమాయంలో విధుల్లో ఉన్న భారత్ సైనికులు ఏడుగురు గల్లంతయ్యారు. ఈ విషయాన్ని ఆర్మీ అధికారులు వెల్లడించారు. గల్లంతైన సైనికులు కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని అంత్యంత ఎత్తయిన ప్రదేశం కమెంగ్ సెక్టార్. సైనికులు పెట్రోలింగ్ విధులు నిర్వర్తిస్తున్న సమయంలో కొండ చరియలు విరిగిపడ్డాయి. ఆ మంచుచరియల్లో సైనికులు చిక్కుకుపోయారని అధికారులు ప్రకటించారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో సెర్చ్, రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నట్లు ఆర్మీ వర్గాలు తెలిపాయి. రెస్క్యూ ఆపరేషన్స్ కోసం ప్రత్యేక దళాలను రంగంలోకి దింపారు.

Recommended Video
గత కొన్ని రోజులుగా కమెంగ్ సెక్టార్ లో భారీగా మంచుకురుస్తుంది. దీంతో పలు ప్రాంతాల్లో మంచు చరియలు విరిగిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు పేర్కొంటున్నారు. సైనికుల కోసం గాలింస్తున్న సెర్చ్, రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్న వారికి సహయంగా నిపుణుల బృందాన్ని కూడా ఎయిర్లిఫ్ట్ ద్వారా ఘటనాస్థలికి తరలించినట్లు ఆర్మీ అధికారులు వెల్లడించారు.
Worrying news…7 #IndianArmy soldiers on patrol duty, got hit by avalanche in Kameng sector of #ArunachalPradesh, Search operation on
— Oxomiya Jiyori 🇮🇳 (@SouleFacts) February 7, 2022
Specialised teams have been airlifted to assist in rescue.
Pray 🙏for our soldiers pic.twitter.com/UN4tx4lFlP












Click it and Unblock the Notifications