ప్రధాని మోదీ, రేవంత్ రెడ్డి ట్వీట్
76th Republic Day: దేశ 76వ గణతంత్ర దినోత్సవానికి ఢిల్లీ ముస్తాబైంది. కర్తవ్యపథ్లో కోలాహలం నెలకొంది. రాష్ట్రపతి ముర్ము జాతీయ జెండాను ఎగుర వేయనున్నారు.స్వర్ణిమ్ భారత్- విరాసత్ ఔర్ వికాస్ అనే థీమ్తో ఈ ఏడాది రిపబ్లిక్ డే వేడుకలు కొనసాగనున్నాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబావో సుబియాంతో హాజరు కానున్నారు.
గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేపట్టారు. ఢిల్లీ- నేషనల్ కేపిటల్ రీజియన్ పరిధిలో 70 కంపెనీలకు పైగా పారామిలటరీ బలగాలు, 70,000 మందికి పైగా పోలీసు సిబ్బందిని మోహరింపజేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు ఏర్పాటు పూర్తి చేశారు. వాహనాల తనిఖీ ముమ్మరంగా కొనసాగుతోంది.

ఒక్క న్యూఢిల్లీ జిల్లాలోనే 15,000 మంది భద్రతా సిబ్బందితో కూడిన ఆరు లేయర్ల భద్రతను ఏర్పాటు చేశారు. డేటా బేస్డ్ ఫేషియల్ రికగ్నిషన్, వీడియో ఎనలిటిక్స్తో కూడిన 2,500కు పైగా సీసీటీవీ కెమెరాల అమర్చారు. కర్తవ్యపథ్ చుట్టూ నాలుగు చదరపు కిలోమీటర్ల మేర గగనతలాన్ని మూసివేశారు.
గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలను తెలియజేశారు. రాజ్యాంగాన్ని నిర్మాతలను స్మరించుకున్నారు. రాజ్యంగ విలువలు.. అతి గొప్ప ప్రజాస్వామ్య దేశంగా నిలబెట్టాయని అన్నారు. దేశ గౌరవాన్ని ద్విగుణీకృతం చేశాయని చెప్పారు. మన రాజ్యాంగ విలువలు, ఆదర్శాలను పరిరక్షించడానికి మరింత కృషి చేస్తామని మోదీ హామీ ఇచ్చారు. అత్యంత శక్తిమంతమైన, సుసంపన్నమైన భారతదేశం కోసం నిరంతరం శ్రమిస్తామని మాటిచ్చారు.
Happy Republic Day.
— Narendra Modi (@narendramodi) January 26, 2025
Today, we celebrate 75 glorious years of being a Republic. We bow to all the great women and men who made our Constitution and ensured that our journey is rooted in democracy, dignity and unity. May this occasion strengthen our efforts towards preserving the…
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాస్వామిక, సార్వభౌమ గణతంత్ర దేశం వర్ధిల్లడానికి మూలాధారం రాజ్యాంగమేనని గుర్తు చేశారు. స్వాతంత్ర్య సమరయోధులు, రాజ్యాంగ నిర్మాతలను స్మరిస్తూ సంవిధానాన్ని స్ఫూర్తిగా తీసుకుని ప్రభుత్వం ఏర్పడిన ఏడాది కాలంలోనే అనేక ప్రజాహిత కార్యక్రమాలను తమ ప్రభుత్వం చేపట్టిందని గుర్తుచేశారు.
75 ఏళ్ల మన గణతంత్ర ప్రస్థానం…
— Revanth Reddy (@revanth_anumula) January 26, 2025
ప్రపంచ ప్రజాస్వామ్యానికి ఆదర్శం.
గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. #RepublicDay #RepublicDayIndia #RepublicDay2025 pic.twitter.com/5H0agEEgpM
ఈ శుభదినం సందర్భంగా రాజ్యాంగ నిర్మాతలు, దేశాన్ని సమున్నత స్థాయిలో నిలిపిన మహనీయులు అందరినీ స్మరించుకుంటూ ప్రతి ఒక్కరూ తెలంగాణ పునర్నిర్మాణంలో పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి ప్రజా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని అన్నారు.
-
నటుడు రాహుల్ రామకృష్ణ ఇంట్లో తీవ్ర విషాదం.. ప్రధాని మోదీకి విన్నపం! -
మార్కాపురం బస్సు ప్రమాద బాధితుల కోసం ప్రధాని కీలక ప్రకటన..!! -
మార్కాపురం ప్రమాద ఘటన: చంద్రబాబు దృష్టికి ప్రమాద కారణం, సీఎం రేవంత్ దిగ్భ్రాంతి! -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !!











Click it and Unblock the Notifications