టెంపో- వ్యాన్ ఢీ: 9 మంది మృతి.. దైవ దర్శనానికి వెళ్లి తిరిగి వస్తోండగా..
కర్ణాటకలో ఘోర ప్రమాదం జరిగింది. హసన్ జిల్లాలో ఉదయం టెంపో ట్రావెల్లర్, కేఎంఎఫ్ పాల వ్యాన్ ఢీ కొంది. అర్సికరే తాలుకా గాంధీనగర్ వద్ద యాక్సిడెంట్ అయ్యింది. ఘటనా స్థలం భీతావాహంగా మారింది. తెల్లవారు జామునే ప్రమాదం జరగడంతో.. సహాయక చర్యలకు ఆటంకం కలిగింది.
ప్రమాదంలో 9 మంది యాత్రికులు చనిపోయారు. మరికొందరు గాయపడ్డారు. వారిని వెంటనే సమీపంలోనే ఆస్పత్రికి తరలించారు. వీరంతా ధర్మస్థల, సుబ్రమణ్య, హననాంబ ఆలయాలను సందర్శించారు. దైవ దర్శనం చేసుకొని.. తిరిగి వస్తున్నారని పోలీసులు తెలిపారు. ఇంతలో ప్రమాదం జరిగిందని వారు వివరించారు.మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.













Click it and Unblock the Notifications