Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రూ కోట్లలో ఆస్తి,భార్యతో బంధువుకు లింక్?, ఆఫీసులో జంట హత్యలు చేసిన భర్త ఏం చేశాడంటే?

కోట్ల రూపాయల ఆస్తికి వారసుడు అయిన వ్యాపారవేత్త అదే ఆస్తి తన ప్రాణం తీస్తుందని ఊహించలేకపోయాడు. మాట్లాడాలని చెప్పిన సమీప బంధువే కాలయముడు అయ్యాడు. సొంత ఆఫీసులో స్నేహితుడితో మాట్లాడుకుంటూ కూర్చున్న వ్యక్తి టీ తాగుతున్నాడు. ఆ సమయంలో ఒక్కసారిగా ఎంట్రీ ఇచ్చిన బంధువు కత్తి తీసి ఇద్దరి ఛాతీపై పొడిచి దారుణంగా హత్య చేసి అదే చోట మినరల్ వాటర్ తాగాడు.

బెంగళూరులో బుధవారం రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో జంట హత్యలు జగరడం కలకలం రేపింది. కోట్ల రూపాయల విలువైన ఆస్తి వివాదంతో జంట హత్యలు జరిగాయని పోలీసు అధికారులు అంటున్నారు. బెంగళూరులో సాయంత్రం ఎనిమిది గంటల ప్రాంతంలో జంట హత్యలు జరిగాయని, పలు కోణాల్లో కేసు విచారణ జరుగుతోందని పోలీసు అధికారులు అంటున్నారు. బెంగళూరు నడిబోడ్డులోని హలసూర్ గేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుంబార పేటలో జంట హత్యలు జరిగాయి.

A businessman who committed double murders over property worth crores of rupees in Bengaluru

శ్రీ హరి మార్కెటింగ్ కార్యాలయంలో సురేష్ ( 55), అతని స్నేహితుడు మహేంద్ర (63) అనే వ్యక్తులను దారుణంగా హత్య చేసిన నిందితులు పోలీసుల ఎదుట లొంగిపోవడం పలు అనుమానాలకు దారితీసింది. ఈ జంట హత్యలు కోట్ల రూపాయల విలువైన ఆస్తి వివాదానికి సంబంధించి రిగాయని ప్రాథమిక విచారణలో తేలింది. ఆస్తి యజమానితో పాటు అతని స్నేహితుడు హత్యకు గురి కావడంతో పలు అనుమానాలు ఉన్నాయని పోలీసు అధికారులు అంటున్నారు.

సురేష్ కు నిందితుడు భద్ర దూరపు బంధువు అవుతాడు. మడు అంతస్తుల వాణిజ్య భవనం యజమాని అయిన సురేష్ కుమార్ అతని భవనంలోనే శ్రీహరి మార్కెటింగ్ కంపెనీ పేరుతో వ్యాపారం సాగిస్తున్నాడు. నిందితుడు భద్ర అదే ప్రాంతంలో కుంబార కులానికి సంబంధిన ట్రస్ట్ నిర్వహిస్తున్నాడు. కుంబార కుల సంఘం ట్రస్ట్‌ను నడుపుతున్న భద్రకు ఆకులంలో పెద్దలు, వ్యాపారులతో పాటు అందరితో పరిచయాలు ఉన్నాయి, సురేష్ కూడా కుంబార కులానికి చెందినవాడే.

సురేష్‌కు చెందిన భవనాన్ని తన ట్రస్టుకు రాసివ్వాలని ట్రస్ట్‌ను నడుపుతున్న భద్ర తరచూ అతనితో గొడవపడుతుండేవాడు. అయితే కోట్ల రూపాయల విలువైన మూడు అంతస్తుల భవనం ట్రస్లుకు రాసివ్వడానికి సురేష్ అంగీకరించలేదు. బుధవారం రాత్రి మాట్లాడుకుందామని భద్ర అతని బందువు సురేష్ కు ఫోన్ చేసి చెప్పాడు. మార్కెటింగ్ ఆఫీస్‌లోకి ప్రవేశించి తన స్నేహితుడు మహేంద్రతో మాట్లాడుతున్న సురేష్ అక్కడు టీ తాగుతున్నాడు. ఆ సమయంలో భద్ర హఠాత్తుగా ఆఫీసులోకి వెళ్లి చేతిలోని కత్తి తీసి సురేష్ ఛాతిపై పొడిచాడు.

స్నేహితుడిని కాపాడుకోవాలని మహేంద్ర భద్రను అడ్డుకున్నాడు. ఆ సందర్బంలో భద్ర అదే కత్తితో మహేంద్ర ఛాతిపై పొడిచేసి ఇద్దరిని స్పాట్ లో చంపేశాడు. జంట హత్యలు చేసిన భద్ర నేరుగా హలాసూర్ గేట్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడని బెంగళూరు సెంట్రల్ డివిజన్ డీసీపీ శేఖర్ గురువారం మీడియాకు చెప్పారు.

హలాసూరు గేట్ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. నిందితుడు భద్ర అతని భార్య విషయంలో బంధువు సురేష్ ను హత్య చేసి ఉంటాడని పోలీసులు అంటున్నారు. తన భార్యకు, సురేష్ కు అక్రమ సంబంధం ఉందని భద్రకు అనుమానం ఉందని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. జంట హత్యల కేసు పలు కోణాల్లో విచారణ చేస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+