వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Kiladi lady: న్యూడ్ వీడియో కాల్, దెబ్బకు సైబర్ క్రైమ్, సీబీఐ, కోట్లు లాగేసిన కిలాడీ లేడి రియా, క్లైమాక్స్ లో ?

|
Google Oneindia TeluguNews

అహమ్మదాబాద్/న్యూఢిల్లీ: నిత్యం బిజీగా ఉంటున్న ఓ వ్యాపారవేత్త తీరికలేకుండా కాలం గడుపుతున్నాడు. ఆ వ్యాపారవేత్తకు ఓ యువతి పరిచయం అయ్యింది. రానురాను ఇద్దరూ ఫోన్లలో మాట్లాడుకున్నారు. తరువాత ఇద్దరికి చనువు పెరిగింది. మనం ఇద్దరూ నగ్నంగా వీడియోకాల్స్ లో మాట్లాడుకుందామని యువతి వ్యాపారికి చెప్పింది. వ్యాపారి ఆమెతో నగ్నంగా వీడియోకాల్ లో మాట్లాడాడు. ఆ సందర్బంలో వ్యాపారితో నగ్నంగా ఆయుతి వీడియో కాల్ లో మాట్లాడింది. తరువాత అసలు కథ మొదలైయ్యింది. క్రైమ్ బ్రాంచ్ పోలీసులు, లేడీ ఇన్స్ పెక్టర్, సీబీఐ అంటూ ఆ వ్యాపారికి ఫోన్ లు వెళ్లాయి. యువతితో నువ్వు నగ్న వీడియోలో మాట్లాడావు అంటూ కోట్ల రూపాయలు వసూలు చేశారు. చివరికి ఇదే నీ కేసుకు సంబంధించిన కోర్టు ఆర్డర్ అని ఓ లెటర్ ఆ వ్యాపారికి పంపించారు.

Wife: భార్తకు బాయ్ చెప్పింది. ప్రియుడితో హోటల్ రూమ్ లో ఎంజాయ్ చేసింది, క్లైమాక్స్ లో ఏం చేసింది?Wife: భార్తకు బాయ్ చెప్పింది. ప్రియుడితో హోటల్ రూమ్ లో ఎంజాయ్ చేసింది, క్లైమాక్స్ లో ఏం చేసింది?

కిలాడీ లేడీ రియా శర్మా

కిలాడీ లేడీ రియా శర్మా

గుజరాత్ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ ఇంధన రంగంలో మంచి పేరు సంపాధించుకున్న ఓ పారిశ్రామికవేత్త వ్యాపారం చెయ్యడానికి ఎక్కువగా బయట తిరుగుతున్నాడు. కోట్ల రూపాయల టర్నోవర్ చేస్తున్నన ఆ వ్యాపారి నిత్యం బిజీగా ఉంటాడు. గత ఏడాది ఆగస్టు నెలలో ఓ మహిళతో ఆ వ్యాపారికి కొత్తగా పరిచయం అయ్యింది. తన పేరు రియా శర్మ అని కిలాడీ లేడీ ఆ వ్యాపారికి చెప్పింది.

రొమాన్స్ చెయ్యాలని ఉంది

రొమాన్స్ చెయ్యాలని ఉంది

తాను మోర్బీ ప్రాంతంలో నివాసం ఉంటున్నానని ఆ వ్యాపారికి రియా శర్మా చెప్పింది. రియా శర్మా అందం చూసిన ఆ వ్యాపారి ఆమె మీద మనసు పారేసుసకున్నాడు. మెల్లగా ఇద్దరి మధ్య పరిచయం బాగా పెరిగింది. నిత్యం ఫోన్లలో గంటలు గంటలు మాట్లాడుకున్నారు. మనం వీడియో కాల్స్ ద్వారా మాట్లాడుకున్నామని, నువ్వు అంటే నాకు ఇష్టం అని రియా శర్మా ఆ వ్యాపారికి చెప్పింది. అప్పటికే యువతితో ఎంజాయ్ చెయ్యాలని ఆశపడిన వ్యాపారి వీడియో కాల్స్ లో మాట్లాడుకోవడానికి ఓకే చెప్పాడు.

నగ్నంగా వీడియోకాల్.... కట్ చేస్తే ?

నగ్నంగా వీడియోకాల్.... కట్ చేస్తే ?

తరువాత రియా శర్మా నువ్వు నా కోరిక తీర్చాలని ఆ వ్యాపారవేత్తకు చెప్పింది. రియా శర్మా స్వయంగా కోరిక తీర్చాలని చెప్పడంతో ఆ వ్యాపారవేత్త తట్టుకోలేకపోయాడు. తరువాత ఇద్దరూ నగ్నంగా వీడియో కాల్‌లో మాట్లాడుకున్నారు. తనతో అప్పుడప్పుడు నగ్నంగా వీడియో కాల్ లో మాట్లాడమని రియా శర్మా ఆ వ్యాపారిని కోరింది. ఆ తర్వాత వ్యాపారి రియా శర్మాకు న్యూడ్ వీడియో కాల్ చేయ్యడం మొదలుపెట్టాడు.

వేల రూపాయలతో మొదలై లక్షల్లో లాగేశారు

వేల రూపాయలతో మొదలై లక్షల్లో లాగేశారు

వ్యాపారవేత్త నగ్నంగా వీడియో కాల్స్ చేస్తున్న సమయంలో రియా శర్మా ఆ వీడియో కాల్స్ రికార్డు చేసింది. తరువాత వ్యాపారికి ఫోన్ చేసిన రియా శర్మా నీ నగ్న వీడియోలు తన దగ్గర ఉన్నాయని, వాటిని సోషల్ మీడియాలో పోస్టు చెయ్యకుండా ఉండాలంటే రూ.50 వేలు పంపాలని లేకుంటే వీడియోను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తానని బ్లాక్ మెయిల్ చేసింది. ఆ వ్యాపారవేత్త భయపడిపోయి రియా శర్మా అకౌంట్ కు రూ. 50వేలు పంపించాడు.

ఢిల్లీ సైబర్ పోలీసులు

ఢిల్లీ సైబర్ పోలీసులు

కొన్ని రోజుల తరువాత ఓ గుర్తు తెలియని వ్యక్తి వ్యాపారికి ఫోన్ చేసి తాను ఢిల్లీ పోలీస్ ఇన్‌స్పెక్టర్ అని చెప్పాడు. నీ నగ్న వీడియోలు తన దగ్గరకు వచ్చాయని, ఆ వీడియోలు బయటకు రాకుండా ఉండాలంటే రూ. 3 లక్షలు ఇవ్వాలని బెదిరించాడు. హడలిపోయిన గుజరాత్ వ్యాపారి ఢిల్లీ ఇన్స్ పెక్టర్ అని చెప్పిన వ్యక్తికి రూ. 3 లక్షలు పంపించాడు. ఆగస్ట్ 14వ తేదీన వ్యాపారికి ఫోన్ చేసిన వ్యక్తి మేము ఢిల్లీ సైబర్ పోలీసులు మాట్లాడుతున్నామని, ఓ మహిళ మహిళ ఆత్మహత్యాయత్నం చేసిందని, ఆమె మొబైల్ ఫోన్ లో నీ నగ్న వీడియోలు ఉన్నాయని, కేసు నమోదు అయ్యిందని బెదిరించారు. తరువాత ఆ ఆ వ్యాపారి నుంచి రూ.80. 97 లక్షలు లాక్కొన్నారు.

సీబీఐ, కోర్టు ఆర్డన్ అని కోట్లలో లాగేశారు

సీబీఐ, కోర్టు ఆర్డన్ అని కోట్లలో లాగేశారు

తరువాత ఆ వ్యాపారికి ఫోన్ చేసిన వ్యక్తి మీ మేము సీబీఐ నుంచి మాట్లాడుతున్నామని, మీ వ్యవహారం సీబీఐ వరకు వచ్చిందని బెదిరించారు. సీబీఐ అధికారుల ముసుగులో రియా శర్మా తల్లి మరో రూ.8. 5 లక్షలు వ్యాపారి నుంచి లాగేసింది. ఈ విధంగా ఆ వ్యాపారవేత్తను బ్లాక్ మెయిల్ చేసి గత ఆగస్టు నెల నుంచి నుండి డిసెంబర్ 15 వరకు నిరంతరం డబ్బు లాగేశారు. ఇప్పటి వరకు నిందితులు ఆ వ్యాపారి నుంచి రూ. 2.69 కోట్ల డబ్బులు లాగేశారు.

హైకోర్టు పేరుతో నకిలీ లెటర్ పంపించి ?

హైకోర్టు పేరుతో నకిలీ లెటర్ పంపించి ?

ఢిల్లీ హైకోర్టు ఆదేశానుసారం డిసెంబర్ 15న మీ కేసును మూసివేసినట్లు బ్లాక్ మెయిల్ ముఠా ఢిల్లీ హైకోర్టు పేరుతో ఓ నకిలీ లెటర్ తయారు చేసి గుజరాత్ వ్యాపారికి పంపించారు. ఆ లెటర్ చూసిన వ్యాపారి అది నకిలీ అని తెలుసుకున్న వ్యాపారికి అనుమానం వచ్చింది. లాయర్ ను సంప్రధించిన ఆ వ్యాపారి తనకు కోర్టు నుంచి వచ్చిన లెటర్ నకిలి అని నిర్దారించుకున్నాడు. జనవరి 10న గుజరాత్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఆ వ్యాపారి ఫిర్యాదు చేశారు. ఓ మహిళ సహా 11 మందిపై సదరు వ్యాపారి ఫిర్యాదు చేశారు. దాని ఆధారంగా పోలీసులు విచారణ ప్రారంభించారు.

మొత్తం మీద ప్రముఖ వ్యాపారిని న్యూడ్ వీడియో కాల్ తో బ్లాక్ మెయిల్ చేసి కోట్ల రూపాయలు డబ్బులు లాగేయడం కలకలం రేపింది.

English summary
A businessman who made a romantic video call to a Kiladi lady, looted crores of rupees with a nude video call.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X