సీఎం మీద కేసు, విచారణకు డేట్ ఫిక్, ఆపరేషన్ కమల, ఎమ్మెల్యేలకు రూ. కోట్లు ఆఫర్ !
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప మీద నమోదైన కేసు విచారణకు డేట్ ఫిక్స్ అయ్యింది. బీఎస్. యడియూరప్ప కర్ణాటక బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఆపరేషన్ కమలకు తెర లేపీ ప్రత్యర్థి రాజకీయ పార్టీల ఎమ్మెల్యేలకు రూ. కోట్లు ఎర చూపి గాలం వేశారని ఆరోపిస్తూ జేడీఎస్ పార్టీ కర్ణాటక కార్యదర్శి శరణగౌడ కేసు నమోదు చేశారు. శరణగౌడ బీఎస్. యడియూరప్ప మీద నమోదు చేసిన కేసు ఇప్పుడు విచారణకు వచ్చింది.

జేడీఎస్ ఎమ్మెల్యేకు రూ. కోట్లు ఆఫర్
బీఎస్. యడియూరప్ప బీజేపీ కర్ణాటక శాఖ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఆపరేషన్ కమలకు తెర లేపారు. ఆ సమయంలో గురుమిట్కల్ అసెంబ్లీ నియోజక వర్గం జేడీఎస్ ఎమ్మెల్యే నాగనగౌడ కుందకూరుకు మాయమాటలు చెప్పి, కోట్ల రూపాయలు ఎర వేసి బీజేపీలో చేర్చుకోవడానికి ప్రయత్నించారని ఆరోపిస్తూ ఆయన కుమారుడు శరత్ గౌడ ఓ ఆడియో విడుదల చేశారు.

ఎమ్మెల్యే కొడుకుతో డీల్
గురుమిట్కల్ జేడీఎస్ ఎమ్మెల్యే నాగనగౌడ కుమారుడు శరత్ గౌడ ఫిర్యాదు మేరకు బీఎస్. యడియూరప్ప మీద కేసు నమోదైయ్యింది. కర్ణాటకలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి బీఎస్. యడియూరప్ప ఆపరేషన్ కమల పేరుతో ఇతర పార్టీల ఎమ్మెల్యేలకు వల వేశారని శరత్ గౌడ ఆరోపిస్తూ కేసు పెట్టారు.

స్టే ఇచ్చిన కోర్టు
బీఎస్. యడియూరప్ప మీద నమోదైన కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చెయ్యకుండా కర్ణాటక కోర్టు మధ్యంతర స్టే ఇచ్చింది.
బీఎస్. యడియూరప్ప మీద ఎఫ్ఐఆర్ నమోదు కాకుండా మధ్యంతర స్టే రావడంతో శరత్ గౌడ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. కేసు హైకోర్టు కులబర్గి పీఠం ముందు నవంబర్ 7వ తేదీ విచారణ జరగనుంది.

యడియూరప్ప అండ్ కో
సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూల్చడానికి ఆపరేషన్ కమల పేరుతో బీఎస్. యడియూరప్ప, హాసన్ ఎమ్మెల్యే ప్రీతం గౌడ, ఎమ్మెల్యే శివనగౌడ నాయక్, యడియూరప్ప పీఏ ఎంబీ. మరమకల్ ఇతర పార్టీల ఎమ్మెల్యేలకు గాలం వేశారని శరత్ గౌడ కేసు పెట్టారు. శరత్ గౌడను భేటీ అయ్యి ఆయన తండ్రి, జేడీఎస్ ఎమ్మెల్యే నాగనగౌడను బీజేపీలో చేర్చుకోవడానికి ప్రయత్నించారని కేసు నమోదైయ్యింది.
-
బెంగాల్ టైగర్ ఎవరో తేల్చేసిన సర్వేలు.. దీదీ మళ్లీ సీఎం అవుతారా? -
Viral Video: ముస్లింలకు పోటీగా మాధవీలత పూజలు..! వీడియో వైరల్..! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు!












Click it and Unblock the Notifications