Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మెడికల్ కాలేజ్ లో ఆవులను పట్టుకుని అమ్మేస్తున్న అదే కాలేజ్ ఉద్యోగి, అసలు మ్యాటర్ ?

కొచ్చి/తిరువనంతపురం: పశువులను దొంగిలించి విక్రయించే కేసులు కేరళలో రోజురోజుకు పెరుగుతున్నాయని పోలీసు అధికారులు అంటున్నారు. ఇప్పుడు కేరళలో వైద్య కళాశాల సిబ్బంది వీధిలో వెలుతున్న పశువులను పట్టుకుని వ్యాపారులకు విక్రయించిన ఘటన వెలుగు చూడటం హాట్ టాపిక్ అయ్యింది. ఈ పశువుల అక్రమాల రాకెట్ వెనుక ఓ సిస్టమేటిక్ నెట్‌వర్క్ పని చేస్తుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

కేరళ మెడికల్ కాలేజీ చుట్టూ తిరుగుతున్న పశువులను పట్టుకుని విక్రయిస్తున్న మెడికల్ కాలేజీ సిబ్బందిని కేరళ పోలీసులు అరెస్ట్ చేశారు. కేరళలోని ఎర్నాకులం ప్రభుత్వ వైద్య కళాశాల డ్రైవర్ బిజు మాథ్యూ అరెస్టు అయిన నిందితుడు. ఎర్నాకుళం మెడికల్ కాలేజీ క్యాంపస్ పరిసర ప్రాంతాలతో పాటు ఆ చుట్టుపక్కల చాలా మంది తమ ఆవులు తప్పిపోయాయని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూ వచ్చింది.

A college employee is secretly selling cattle on the medical college campus in Kerala.

ఒకే ప్రాంతం నుంచి ఇన్ని ఆవులు ఎందుకు కనిపించకుండా పోతున్నాయన్న అనుమానంతో పోలీసులు విచారణ ప్రారంభించారు. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు సీసీటీవీ కెమెరాల ఫుటేజీలు, ఇతర సమాచారాన్ని స్వాధీనం చేసుకున్నారు. కొందరు వ్యక్తులు పశువులకు నీరు, గడ్డి, ఇతర ఆహారం ఇస్తున్నట్లు సీసీటీవీల్లో వెలుగు చూసింది. కేసును మరింత లోతుగా విచారించిన పోలీసులు మెడికల్ కాలేజీ డ్రైవర్‌పై అనుమానం వ్యక్తం చేశారు.

ఎర్నాకులం ప్రభుత్వ మెడికల్ కాలేజీలో డ్రైవర్‌గా పని చేస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించడంతో కేసు వెలుగులోకి వచ్చింది. క్యాంపస్ చుట్టుపక్కల ఉన్న ఆవులకు నీరు, మేత ఇచ్చి వాటిని పట్టుకుని వ్యాపారులకు ఇచ్చేవాడు. ఇందుకు సంబంధించి పశువుల వ్యాపారులతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. పోలీసుల విచారణలో నిందితుడు బిజు మ్యాథ్యూ కలకలం రేపే విషయాలు బయటకు చెప్పాడు.

A college employee is secretly selling cattle on the medical college campus in Kerala.
ఇది ఒక్క కాలేజీ సిబ్బంది చేసిన దొంగతనం కాదు. దీని వెనుక అతి పెద్ద నెట్‌వర్క్ నిర్వహిస్తున్నట్లు సమాచారం ఉందని, చాలా ప్రాంతాల్లో ఇలాంటి నెట్‌వర్క్‌లు నడుస్తున్నాయని పోలీసు అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. మెడికల్ కాలేజీ ఆవరణలో గడ్డి మైదానం ఉంది. చాలా ఆవులు మేత కోసం ఇక్కడికి వస్తుంటాయని, అదే కాలేజ్ లో ఉద్యోగం చేస్తున్న బిజు మ్యాథ్యూ ఆ పశువుల మీద కన్ను వేశాడని పోలీసు అధికారులు తెలిపారు.

దీన్ని పెట్టుబడిగా పెట్టుకున్న బిజు మాథ్యూ మరికొందరి సాయంతో ఆవులను పట్టుకుని విక్రయించేవాడు. వ్యాపారులు ఆ పశువును చంపేసి వాటి మాంసం విక్రయిస్తున్నారని పోలీసు అధికారులు తెలిపారు. గతంలో మెడికల్ కాలేజీ డ్రైవర్‌గా పనిచేస్తున్న బిజు మాథ్యూ అదే వ్యాపారంలోకి దిగి ఇటీవల కొత్త వాహనాలు కొనుగోలు చేశాడు. ఇప్పుడు అతని వ్యాపారం కేవలం పశువుల దొంగతనాలకే పరిమితం కాలేదని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+