Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మోజు తీర్చుకోవడానికి కాలేజ్ అమ్మాయితో పెళ్లి, కట్నం కోసం మరో అమ్మాయితో?, స్కెచ్ రివర్స్!

కాలేజీలో చదువుతున్నప్పుడే కుటుంబ సభ్యుల వ్యతిరేకతతో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లయిన వాడితో ఆనందంగా కుటుంబాన్ని గడుపుదాం అని ఆ యువతి చాలా ఆశపడింది, కానీ ఇప్పుడు ఆ భర్త అతని తల్లిదండ్రులు చూపించిన మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. దీంతో మనస్తాపం చెందిన యువతి ఉరి వేసుకోవడం కలకలం రేపింది.

కాలేజ్ లో చదువుతున్నప్పుడు మీరు పొరపాటున ప్రేమలో పడితే మీరు జీవితంలో విజయం కంటే కష్టాలను ఎక్కువగా అనుభవిస్తారు అని చెప్పడానికి ఇది ఓ చక్కటి ఉదాహరణ, ప్రేమించిన ఎదుటి వ్యక్తి మంచివాడైతే ఎలాంటి సమస్యలు రావు. లేదంటే జీవితంలో లేనిపోని కష్టాలు ఎదురౌతాయి. కష్టసుఖాల్లో ప్రేమించిన వ్యక్తి తోడుగా ఉంటే ముందుకుసాగిపోవడం సాలా సులభం. అయితే ప్రేమించిన వ్యక్తి మోసం చేస్తే జీవితం నాశనం అవుతుంది.

A college girl committed suicide after her boyfriend cheated on her a month after getting married

కర్ణాటక ప్రభుత్వ ప్రభుత్వ ఇన్‌స్ట్రుమెంటేషన్ అండ్ ట్రైనింగ్ (జీటీటీసీ) చదువుతున్న విశాలాక్షి అనే యువతి అదే కాలేజ్ లో చదువుతున్న తిప్పేస్వామి ప్రేమలో పడింది.. ఆతర్వాత ప్రేమించాలంటే పెళ్లి చేసుకోవాలని అమ్మాయి కండిషన్ పెట్టింది. విశాలక్ష్మి మీద ప్రేమతో అబ్బాయి తిప్పేస్వామి పెళ్లి చేసుకుంటానని ఆమెకు హామీ ఇచ్చాడు. అయితే తిప్పేస్వామిని పెళ్లి చేసుకోవడానికి విశాలాక్షి కుటుంబ సభ్యులు అంగీకరించలేదు.

కుటుంబ సభ్యుల వ్యతిరేకతతో విశాలాక్షి ఆమె ప్రియుడు తిప్పేస్వామిని పెళ్లి చేసుకుంది. పెళ్లయిన కొద్ది రోజులు మాత్రమే ఇద్దరూ వేరే ఇంటిలో కాపురం పెట్టారు. తరువాత తిప్పేస్వామికి అతని కుటుంబ సభ్యులు బ్రెన్ వాష్ చేసి అతన్ని తీసుకెళ్లిపోయారు. అనంతరం విశాలాక్షి(21) ప్రియుడు మోసం చేశాడని ఆవేదనతో ఆమె స్వగ్రామానికి చేరుకుంది. ఏదో ఒకరోజు తన ప్రేమికుడు తిప్పేస్వామి మళ్లీ తనతోనే జీవిస్తాడని ఆమె ఎంతో ఆశగా ఎదురు చూసింది.

A college girl committed suicide after her boyfriend cheated on her a month after getting married

అయితే తన కుటుంబ సభ్యులు చూపించిన మరో అమ్మాయిని తిప్పేస్వామి పెళ్లి చేసుకున్నాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన విశాలాక్షి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కర్ణాటకలోని చిత్రదుర్గ తాలూకాలోని కూనబేవు గ్రామంలో విశాలాక్షి ఆత్మహత్య చేసుకుంది. అనంతరం మృతురాలు విశాలాక్షి తల్లిదండ్రులు తిప్పేస్వామిపై, అతడి కుటుంబసభ్యులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ కుమార్తెకు పెళ్లి చేసుకుని మోసం చెయ్యడంతో ఆమె ఆత్మహత్య చేసుకుందని కేసు పెట్టడంతో తిప్పేస్వామి పారిపోయాడు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+