Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మెట్రో రైలులో లేడీ బంగారు ఉంగరం చిక్కింది. మహిళా హోమ్ గార్డులు ఏం చేశారంటే ?

ఇటీవల నమ్మ బెంగళూరు మెట్రోలో ప్రయాణించే వారి సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. మెట్రో ప్రయాణికుల రద్దీ మధ్య మెట్రో రైలు లోపలికి వెళ్లడం కష్టంగా ఉందని ప్రయాణికులు తరచూ వాపోతున్నారు. అయితే మెట్రో రైలు ప్రయాణికుల రద్దీని అరికట్టడానికి అధికారులు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఓ బ్యాంకు మహిళా ఉద్యోగి రూ 30 వేలకు పైగా విలువైన బంగారు ఉంగరాన్ని బెంగళూరు మెట్రో రైలులో పోగొట్టుకున్నారు.

దివ్యా అనే బ్యాంక్ ఉద్యోగి మెట్రో రైలులో బ్యాంకుకు వెళుతుండగా బంగారు ఉంగరం పోగొట్టుకున్నారు. దివ్యా ప్రియదర్శిని అలియాస్ దివ్యా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హోస్ కోటే బ్రాంచ్‌లో పనిచేస్తున్నారు. క్రాంతివీర సంగొళిరాయన్న మెట్రో రైల్వే స్టేషన్ నుంచి బెన్నిగానహళ్లి రైల్వే స్టేషన్ వరకు మెట్రోలో ప్రయాణించిన దివ్యా అక్కడి నుంచి బస్సులో హోస్ కోటేలోని ఆమె కార్యాలయానికి చేరుకున్నారు.

A female bank employee lost her gold ring in a Bengaluru Metro train.

ఇంతలో దివ్యా బంగారు ఉంగరాన్ని పోగొట్టుకున్న విషయం గమనించింది. క్రాంతివీర సంగొళిరాయన్న మెట్రో స్టేషన్‌ నుండి బయలుదేరే సమయంలో ఉంగరం ఉందని, తరువాత కనిపించలేదని దివ్యా తెలుసుకుంది. వెంటనే బ్యాంకు ఉద్యోగి దివ్యా కంట్రోల్ రూమ్‌కి ఫోన్ చేసి తన బంగారు ఉంగరం పోయిందని, మీకు బంగారు ఉంగరం గురించి తెలిస్తే తనకు సమాచారం ఇవ్వాలని మనవి చేసింది.

అయితే బంగారు ఉంగరం బెంగళూరు మెట్రోలో ఉద్యోగం చేస్తున్న మహిళా హోంగార్డులకు చిక్కడంతో మెట్రో అసిస్టెంట్ సెక్యూరిటీ అధికారికి అందజేశారు. సోమవారం బెన్నిగానహళ్లి మెట్రో స్టేషన్‌లోని 2వ ప్లాట్‌ఫారమ్‌లో రైలు ఆగినప్పుడు హోంగార్డులు శిల్పా జీఆర్‌, ఈశ్వరమ్మ అనే హెమ్ గార్డులకు బంగారు ఉంగరం చిక్కింది. బంగారు ఉంగరం చిక్కిన వెంటనే బీఎంఆర్‌సీఎల్‌ అసిస్టెంట్‌ సేఫ్టీ ఆఫీసర్‌ కేఎన్‌ రాజన్నకు మహిళా హోమ్ గార్డులు ఆ బంగారు ఉంగరాన్ని అప్పగించారు.

A female bank employee lost her gold ring in a Bengaluru Metro train.
బెంగళూరు మెట్రో రైలు లేడీస్‌ కోచ్‌ దగ్గర రింగ్‌ పడి ఉందని, ఇప్పుడు ఆ ఉంగరం చిక్కిందని మెట్రో అధికారులు బ్యాంకు ఉద్యోగి దివ్యాకు సమాచారం ఇచ్చారు. వెంటనే బెన్నిగానహళ్లిలోని మెట్రో స్టేషన్ కు చేరుకున్న బ్యాంకు ఉద్యోగి దివ్యా ఆమె బంగారు ఉంగరాన్ని తీసుకున్నారు. మెట్రో రైలులో ఉద్యోగం చేస్తున్న మహిళా హోమ్ గార్డుల నిజాయితీ గురించి తెలుసుకున్న దివ్యా వారిని అభినందించారు.

రూ 30 వేలకు పైగా విలువైన బంగారు ఉంగరాన్ని తిరిగిచ్చిన మెట్రో రైలు గోల్డెన్ గర్ల్స్ నిజాయితీని, వారి కృషి అభినందనీయమని మెట్రో రైలు ప్రయాణికులు అంటున్నారు. మొత్తానికి నమ్మ బెంగళూరు మెట్రో రైలు ఒకదాని తర్వాత మరొకటి వార్తల్లో నిలుస్తుండగా హాట్ టాపిక్ అయ్యింది. అయితే ప్రస్తుతం నమ్మ బెంగళూరు మెట్రో సిబ్బంది నిజాయితీపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+