బాలికపై అత్యాచారం చేసి, పారిపోయిన చర్చి ఫాదర్
ఎర్నాకులం: బాలిక మీద అత్యాచారం చేసిన చర్చి ఫాదర్ ను పట్టుకునేందుకు కేరళ పోలీసులు పలు రాష్ట్రాలలో అతని కోసం గాలిస్తున్నారు. ఫాదర్ ఎడ్విన్ ఫిగర్జ్ జోసెఫ్ అనే వ్యక్తి పోలీసుల కళ్లు గప్పి 12 రోజుల క్రితం తప్పించుకున్నాడు.
ఎర్నాకులం సమీపంలోని క్యాథలిక్ మాత చర్చిలో ఫాదర్ గా పని చేస్తున్నఎడ్విన్ ఫిగర్జ్ జోసెఫ్ అదే చర్చికి వచ్చి వెలుతున్న 14 సంవత్సరాల బాలిక మీద ఇదే జనవరి నుండి మార్చి నెల మద్యలో ఐదు సార్లు అత్యాచారం చేశాడని పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇతని మీద పదేపదే ఆరోపణలు రావడంతో చర్చి ఫాదర్ విధుల నుండి తప్పించారు. ఎడ్విన్ ముందస్తు బెయిల్ కు హైకోర్టులో అర్జీ సమర్పించాడు. అయితే న్యాయస్థానం ఇతనికి బెయిల్ మంజూరు చెయ్యలేదు. 10వ తరగతి చదువుతున్న బాలిక గత సంవత్సరం నుండి చర్చి ఫాదర్ తో కలసి పని చేస్తున్నది.

చర్చి కార్యకలాపాలలో చురుకుగా పాల్గోంటున్నది. ఇదే అలుసుగా తీసుకున్న ఫాదర్ బాలిక మీద అత్యాచారం చెయ్యడం మొదలు పెట్టాడు. విషయం బయటకు తెలిస్తే చంపేస్తానని బెదిరించాడు. విషయం తెలుసుకున్న బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసుల విచారణలో ఫాదర్ బాలిక మీద అత్యాచారం చేశాడని వెలుగు చూసింది. హై కోర్టులో ముందస్తు బెయిల్ రాకపోవడంతో ఈనెల 5వ తేదిన ఎడ్విన్ అదృశ్యం అయ్యాడు. అతని కోసం లుకౌట్ నోటీసులు జారీ చేశారు. కేరళ సరిహద్దులతో పాటు అన్ని విమానాశ్రయాలలో ఎడ్విన్ కోసం గట్టి నిఘా వేశారు.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications