ఎయిరిండియా ఫ్లైట్లో ఘోరం: మల, మూత్ర విసర్జన- ఓపెన్గా, ప్రయాణికుల మధ్యే
న్యూఢిల్లీ: విమానాల్లో ప్రయాణికుల దురుసు ప్రవర్తనకు అడ్డు అదుపు ఉండట్లేదు. కొద్దిరోజులుగా ఈ దుష్పరిణామాలు సంభవిస్తూనే వస్తోన్నాయి. ఓ మహిళపై తోటి ప్రయాణికుడు మూత్రం పోసిన ఉదంతాన్ని విస్మరించకముందే మరోసారి అలాంటి సంఘటనే చోటు చేసుకుంది. అది కూడా ఎయిరిండియా విమానంలోనే కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
కొద్దిరోజుల కిందటే- 256 మంది ప్రయాణికులతో ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్కు బయలుదేరిన విమానంలో ఘర్షణ చోటు చేసుకున్న విషయం తెలిసిందే. విమానాశ్రయం నుంచి టేకాఫ్ తీసుకున్న కొద్దిసేపటికే ఓ ప్రయాణికుడు హంగామా సృష్టించాడు. సిబ్బందితో గొడవకు దిగాడు. వారిపై దాడి చేశాడు. ఎయిర్ హోస్టెస్పై భౌతిక దాడికి పాల్పడ్డాడు. అడ్డుకోవడానికి ప్రయత్నించిన తోటి ప్రయాణికులపైనా అతను దురుసుగా ప్రవర్తించాడు.

ఇప్పుడు తాజాగా మరోసారి అలాంటి ఉదంతమే చోటు చేసుకుంది. ఓ వ్యక్తి- విమానంలో బహిరంగంగా మల, మూత్ర విసర్జన చేశాడు. ముంబై-ఢిల్లీ మధ్య నడిచే ఎయిరిండియా విమానం అది. ఓ వ్యక్తి తాను కూర్చున్న సీటుపై మల, మూత్ర విసర్జన చేశాడు. విమానం ఢిల్లీలోని విమానాశ్రయానికి చేరిన వెంటనే అతణ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఫ్లైట్ కెప్టెన్ దాఖలు చేసిన ఫిర్యాదు మేరకు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఎఫ్ఐఆర్ ప్రకారం నమోదు చేశారు.
ఈ నెల 24వ తేదీన ఈ ఘటన చోటు చేసుకుంది. ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఏఐసీ 866లో ముంబై నుంచి ఢిల్లీకి బయలుదేరిన విమానంలో సీటు నంబర్ 17లో కూర్చున్న ప్రయాణికుడు ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. సీట్పై మల, మూత్ర విసర్జన చేయడం, ఉమ్మి వేయడం, అడ్డుకోవడానికి ప్రయత్నించిన తోటి ప్రయాణికులపై దురుసుగా ప్రవర్తించాడు. క్యాబిన్ సూపర్వైజర్పై బూతులతో విరుచుకుపడ్డాడు.
ఈ విషయాన్ని ఫ్లైట్ కెప్టెన్కు తెలియజేయడంతో ఆయన ఢిల్లీ విమానాశ్రయంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. విమానం ఢిల్లీ విమానాశ్రయంలో ల్యాండ్ అయిన వెంటనే ఎయిర్ ఇండియా సెక్యూరిటీ చీఫ్ అతన్ని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు ఆఫ్రికాలో వంట మనిషిగా పనిచేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications