వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
షాక్: పెళ్లైన తెల్లారే నగలతో ఉడాయించిన నవ వధువు
ఎంతో ఆనందంగా ఇష్టమైన వరుడితో వివాహం చేసుకుంది. ఆ మర్నాడే పెళ్లి సందర్భంగా పెట్టిన నగలతో ఉడాయించింది ఓ నవవధువు. ఈ వింత ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్ జిల్లా నజిరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోట
కాన్పూర్: ఎంతో ఆనందంగా ఇష్టమైన వరుడితో వివాహం చేసుకుంది. ఆ మర్నాడే పెళ్లి సందర్భంగా పెట్టిన నగలతో ఉడాయించింది ఓ నవవధువు. ఈ వింత ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్ జిల్లా నజిరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. సరోజనీ నగర్ కు చెందిన శ్యాంబాబు అనే యువకుడు, దేవరియా గ్రామానికి చెందిన యువతిని ఫిబ్రవరి 23న వివాహం చేసుకున్నాడు. పెళ్లి బంధువుల మధ్య ఎంతో సందడి జరిగింది.
అయితే, పెళ్లైన మరుసటి రోజు ఉదయం నుంచి నవ వధువు కనిపించకుండా పోయింది. వధూవరులకు చెందిన 2.50లక్షల విలువైన నగలు కూడా ఆమెతోపాటు మాయమైపోవడంతో వరుడు, అతని కుటుంబసభ్యులు దిగ్భ్రాంతికి గురయ్యారు.
ఆమె సెల్ ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ రావడంతో చేసేదేం లేక.. పోలీసులను ఆశ్రయించారు. వరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.
Comments
English summary
A new bride allegedly escapes with gold ornaments day after wedding in Uttar Pradesh state.
Story first published: Saturday, February 25, 2017, 17:07 [IST]