ఆర్ధిక మాంద్యానికి చిదంబరం విధానాలే కారణం, ప్రధానికి లేఖ రాస్తూ సూసైడ్ చేసుకున్న రిటైర్డ్ అధికారి
కేంద్ర మాజీ ఆర్ధిక మంత్రి పి. చిదంబరంపై మరో అరోపణ వచ్చి పడింది. ఇప్పటికే మనిల్యాండరింగ్ కేసులో విచారణ ఎదుర్కోంటున్న ఆయనపై ఓ మాజీ ఇండియన్ ఏయిర్ ఫోర్స్ అధికారి ఆరోపణలు చేస్తూ ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రస్థుత ఆర్ధిక మాంద్యానికి గత ప్రభుత్వంలో చిదబరం చేపట్టిన ఆర్ధిక విధానాలే కారణమంటూ తీవ్ర ఆరోపణలు చేశాడు. ఆయన విధానాలతో దేశంలోని ఆర్ధిక వ్యవస్థ గాడితప్పడంతో పాటు తన ఇంటిపై కూడ ప్రభావం పడిందని అన్నారు.
ప్లాస్టిక్ నిషేధానికి ప్రపంచ దేశాలు ముందుకు రావాలి : నరేంద్ర మోడీ
ఆస్సాంలోని మంగల్డోయ్ ప్రాంతానికి చెందిన రిటైర్డ్ భారత వైమానిక దళ అధికారి అయిన బీజాన్ దాస్ డిల్లీ ప్రయాగరాజ్లోని ఓ హోటల్లో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈనేపథ్యంలోనే ప్రధాని నరేంద్ర మోడీకి ఆయన నాలుగు పేజీల సూసైడ్ నోట్ రాశాడు. నోట్ గత యూపీఏ పాలనలో జరిగిన అవినీతి ఆర్ధిక విధానాలు ప్రస్థుతం ఆర్ధిక నష్టాలకు కారణమని పేర్కోన్నారు. చిదంబరం విధానాలతో తన కుటుంభంతో పాటు దేశంలో ఆర్ధిక మందగమనానికి గురైందని పేర్కోన్నారు. ఈనేపథ్యంలోనే తన కుటుంభాన్ని, ముఖ్యంగా తన కుమారుడి భవిష్యత్ను పీఎం నరేంద్ర మోడీ చూసుకోవాలని కోరాడు.
అయితే ఇటివల మనీ ల్యాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన చిదంబరం కేంద్రప్రభుత్వ విధానాలపై వంగ్యాస్త్రాలను విసిరారు. కోర్టుకు హజరైన చిదంబరంను బెయిల్ ఎందుకు రావడం లేదు అంటూ ప్రశ్నించిన జర్నలిస్టుకు తన అయిదు వేళ్లు చూపిస్తూ.. భారత దేశ జీడీపీ వృద్ది రేటు 5 కూడ దాటక పోవడంతో తనకు బెయిల్ రావడం లేదంటూ ఆయన సంకేతాలను ఇచ్చారు. దీంతోపాటు ప్రతిపక్ష కాంగ్రెస్ నేతలు సైతం ఆర్ధిక మాంద్యాన్ని ఎలా కట్టడి చేయాలో తెలియక మోడీ ప్రభుత్వం తికమక పడుతోందని విమర్శించారు.