రిపబ్లిక్ డే ఉత్సవాలకు గెస్ట్ బ్రూనే సుల్తాన్: అబ్బురపరిచాడిలా..
న్యూఢిల్లీ: భారత రిపబ్లిక్ డే ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొనేందుకు వచ్చిన బ్రూనే సుల్తాన్ హసనై బొకి చేసిన పని అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తింది. ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల్లో ఒకడైన బ్రూనె సుల్తాన్ హసనై బొకీ తన జంబో జెట్ను తానే డ్రైవ్ చేసుకొంటూ శుక్రవారం నాడు ఢిల్లీలో దిగాడు.
బ్రూనే సుల్తాన్కు స్వాగతం చెప్పేందుకు ఎదురు చూస్తున్న భారత అధికారులకు కాక్పిట్లో బ్రూనే సుల్తాన్ ఉండడంతో ఆశ్చర్యపోయారు.కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బ్రూనై సుల్తాన్ భారత్కు రావడం ఇదే తొలిసారి.

ఇతర దక్షిణాసియా దేశాల మాదిరిగా బ్రూనై వార్తల్లో నిలవకపోయినా 71 ఏళ్ల సుల్తాన్ చేసిన ఈ ఫీట్తో ఆ దేశం హైలైట్ అయిందని అధికారులు చెప్పుకుంటున్నారు.
2008, 2012లో సుల్తాన్ భారత్ పర్యటనకు వచ్చినప్పుడూ తన విమానాలకు ఆయనే కెప్టెన్గా వ్యహరించారని అధికారులు గుర్తుచేసుకున్నారు. విదేశీ పర్యటనల సందర్బంగా సుల్తాన్ తన 747-700 ఎయిర్క్రాఫ్ట్కు ఆయనే పైలెట్గా వ్యవహరిస్తారు.












Click it and Unblock the Notifications