Dog: గంటల వ్యవధిలో 29 మందిని కరిచిన కుక్క.. ఆ శునకానికి రేబిస్ పాజిటివ్..
దేశంలో కుక్క కాట్లు పెరిగిపోతున్నాయి. తాజాగా ఓ కుక్క ఒకే రోజు 29 మందిని కరిచింది. ఈ ఘటన తమిళనాడులో జరిగింది. చెన్నైలో ఓ కుక్కు గంటల వ్యవధిలో 29 మందిని కుక్క కరిచింది. మంగళవారం రాత్రి జీఏ రోడ్డులో ఓ కుక్క కేవలం రెండు గంటల వ్యవధిలో ఐదుగురు పిల్లలతో పాటు మొత్తం 29 మందిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. గాయపడిన వారికి ప్రభుత్వ స్టాన్లీ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో చికిత్స అందిచారు.
29 మందిని కరిచిన తర్వాత వీధి కుక్క పై ఆగ్రహంతో స్థానికులు దాన్ని కొట్టి చంపారు. అయితే వెటర్నరీ వైద్యులు కుక్క మృతదేహానికి పోస్ట్ మార్టమ్ నిర్వహించారు. పోస్ట్ మార్టం రిపోర్టులో సంచనల విషయం బయటకొచ్చింది. 29 మందిని కరిచిన కుక్కకు రేబీస్ ఉందని తేలింది. దీంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. కుక్క దాడిలో గాయపడిన వారికి రేబీస్ వ్యాక్సిన్ ను ఇచ్చారు. బాధితులను అబ్జర్వేషన్ లో ఉంచినట్టు తెలిపారు.

ఈ ఘటనతో చెన్నై కార్పొరేషన్ యంత్రాంగం అప్రమత్తమైంది. గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ ఆధ్వర్యంలో రాయపురం ప్రాంతంలో ఉన్న కుక్కలను పట్టుకొని వాటికి టీకాలు చేయించారు. చెన్నై నగరంలో మొత్తం ఐదు యానిమల్ బర్త్ కంట్రోల్ కేంద్రాల ద్వారా కుక్కులకు టీకాలు ఇచ్చే కార్యక్రమం ప్రారంభించారు. త్వరలో చెన్నై నగరంలో ఉన్న కుక్కల జనాభా గణన కూడా చేపట్టనున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. సోమవారం నుంచి కుక్కల గణన చేపట్టునున్నట్లు కార్పొరేషన్ కమిషనర్ చెప్పారు.
చెన్నై నగరంలో పెద్ద సంఖ్యలో వీధి కుక్కలున్నట్లు గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ వెల్లడించింది. వీధి కుక్కలకు టీకాలు వేయడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. 2023లో మొత్తం 17 వేలకు పైగా వీధి కుక్కులకు పట్టుకున్నామని తెలిపారు. వీటిలో 13 వేల కుక్కలను వైద్యం అందించినట్లు వివరించారు.
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు












Click it and Unblock the Notifications