డాన్ లాగా ఫోజు కొడుతున్న బీజేపీ లీడర్, ఓటు వేస్తే మీకథ క్లోజ్, కాంగ్రెస్ !
బెంగళూరు/బెళగావి: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోవడం ఎక్కువ అయ్యింది. ఎమ్మెల్యేగా ఎలాగైనా గెలవాలి అని అనుకుంటున్న బీజేపీ నాయకుడికి కాంగ్రెస్ పార్టీ నాయకులు చుక్కలు చూపించారు. బీజేపీ నాయకుడి చేతిలో రివాల్వర్ పట్టుకుని దానిని గిర్రున తిప్పుతూ ఫోజులు కొడుతున్న వీడియోను కాంగ్రెస్ పార్టీ విడుదల చెయ్యడం కలకలం రేపింది.
ఏఐసీసీ అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి మల్లికార్జున ఖార్గే కుమారుడు ప్రియాంక ఖార్గే కలబురిగి జిల్లాలోని చిత్తాపుర అసెంబ్లీ నియోజక వర్గం నుంచి పోటీ చేస్తున్నారు. చిత్తాపురకు కాంగ్రెస్ కంచుకోటగా పేరు ఉంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, మాజీ మంత్రి ప్రియాంక ఖార్గే తండ్రి మల్లికార్జున ఖార్గే సామాన్యమైన వ్యక్తి కూడా కాదు.

ఇలాంటి చిత్తాపుర నియోజక వర్గంలో బీజేపీ అభ్యర్థిగా మణికంఠ రాథోడ్ ఎన్నికల బరిలో దిగాడు. బీజేపీ లీడర్ మణికంఠ రాథోడ్ ఒక రౌడీషీటర్ అనే అస్త్రాన్ని ముందు పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ బీజేపీకి ఓటు వేస్తే మీకు కష్టాలు తప్పవని ప్రచారం చేస్తోంది. ఇదే సందర్బంలో కాంగ్రెస్ పార్టీకి బీజేపీ నాయకుడు మణికంఠ రాథోడ్ కు సంబంధించిన ఓ వీడియో చిక్కింది.
విలాసవంతమైన కుర్చీలో కుర్చున్న మణికంఠ రాథోడ్ రివాల్వర్ చేతిలో పట్టుకుని దానిని గిర్రున తిప్పుతూ చివరికి ఎదుటి వ్యక్తికి గురి చూపిస్తున్నట్లు ఉన్న వీడియోను కాంగ్రెస్ పార్టీ నాయకులు పార్టీ అధికారిక సోషల్ మీడియాలో విడుదల చేసింది. బీజేపీ నాయకుడు మణికంఠ రాథోడ్ ఓ గ్యాంగ్ స్టర్ లా ఫోజులు కొడుతూ వీడియో తీసుకున్నాడని కాంగ్రెస్ ఆరోపించింది.
ಭೂಗತ ಪಾತಕಿಯಂತೆ ಕಾಣುತ್ತಿರುವ ಈತ ಬಿಜೆಪಿಯ ಅಭ್ಯರ್ಥಿ.
— Karnataka Congress (@INCKarnataka) April 29, 2023
ಹಾಗೂ ಬಿಜೆಪಿಗೆ ಆದರ್ಶ ವ್ಯಕ್ತಿ!
ಗಡಿಪಾರು ಆಗಿದ್ದೆ ಈತನ ಅರ್ಹತೆ, ಬಡವರ ಅಕ್ಕಿ, ಅಂಗನವಾಡಿ ಮಕ್ಕಳ ಹಾಲಿನಪುಡಿ ಕದ್ದಿದ್ದೇ ಯೋಗ್ಯತೆ.
ಶೋಕಿ ಮಾಡಲು ಈತನ ಕೈಗೆ ಪಿಸ್ತೂಲು ಬಂದಿದ್ದು ಹೇಗೆ? ಈ ಬಗ್ಗೆ ಪೊಲೀಸರು ಅಕ್ರಮ ಶಸ್ತ್ರಾಸ್ತ್ರ ಕಾಯ್ದೆಯಡಿ ಪ್ರಕರಣ ದಾಖಲಿಸಿ ತನಿಖೆ ಮಾಡಬೇಕು… pic.twitter.com/ysKwJpTaBo
ఇలాంటి మణికంఠ రాథోడ్ కు ఓటు వేస్తే ఇక్కడి ప్రజలకు సమస్యలు తప్పవని కాంగ్రెస్ పార్టీ నాయకులు హెచ్చరించారు. రౌడీషీటర్ జాబితాలో ఉన్న మణికంఠ రాథోడ్ ను కలబురిగి జిల్లా ఎస్పీ వైఎస్. రవికుమార్ జిల్లా బహిష్కరణ చేశారు. తరువాత హైకోర్టుకు వెళ్లిన మణికంఠ రాథోడ్ జిల్లా బహిప్కరణ ఆదేశాలకు స్టే తెచ్చుకున్నారు.
పేదలకు ఇస్తున్న రేషన్ బియ్యం బ్లాక్ మార్కెట్ లో విక్రయిస్తున్నాడని, రౌడీయిజం చేసి ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నాడని బీజేపీ నాయకుడు మణికంఠ రాథోడ్ మీద కలబురిగి, బీదర్, యాదగిరి జిల్లాల్లో అనే కేసులు నమోదు అయ్యాయి, పేదల కడుపుకొట్టి రౌడీషీటర్ అయిన మణికంఠకు బీజేపీ ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చిందని కాంగ్రెస్ పార్టీ ఎదురుదాడికి దిగింది.
అక్రమంగా మారణాయుధాలు పెట్టుకుని ప్రజలను బెదిరిస్తున్న బీజేపీ నాయకుడు మణికంఠ రాథోడ్ మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికల కమీషన్ అధికారులకు ఫిర్యాదు చెయ్యడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. మణికంఠ రాథోడ్ దగ్గర ఉన్న రివాల్వర్ కు లైసెన్స్ కూడా లేదని కొందరు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు.
-
వాస్తు అనేది నిజమేనా? ఎందుకు దాన్ని ఫాలో అవ్వాలి? -
పాపం.. అన్నామలై: అన్ హ్యాపీ- మొదటికే మోసం, పోటీకి దూరం? -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
భారత జట్టుకు అవమానం.. స్టేడియంలోకి నో ఎంట్రీ! -
శ్రీరాముడిగా మెప్పించిన తెలుగు హీరోలు వీళ్ళే..?











Click it and Unblock the Notifications