Crime News: భర్త మర్మాంగాన్ని కోసిన భార్య.. ఎందుకో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
ప్రతి ఒక్కరికి ఓపిక ఉంటుంది. అయితే ఈ ఓపిక కొందరికి ఎక్కువగా.. కొందరికి తక్కువగా ఉంటుంది. అయితే ఓపిక నశిస్తే ఏం కోపం వస్తుంది. కోపంలో వారు ఏం చేస్తారో వారికే అర్థం కాదు. ఇలానే ఓపిక నశించిన ఓ ఇల్లాలు భర్తను నరికి చంపింది. నల్లగా ఉన్నావు, అందంగా లేవంటూ భర్త వేధింపులకు దిగడంతో ఓపిక నశించిన భార్య భర్తను గొడ్డలితో నరికి హత్య చేసింది.
ఛత్తీస్గఢ్లోని దుర్గ్ జిల్లాలోని అమలేశ్వర్ గ్రామంలో అనంత్ అతని భార్య సంగీత నివసిస్తున్నారు. అయితే పెళ్లైనప్పటి నుంచి అనంత్ భార్యను నల్లగా ఉన్నావు.. అందంగా లేవంటూ వేధిస్తూ ఉండేవాడు. ఈ విషయమై ఇద్దరి మధ్య పలుమార్లు లోల్లులు అయ్యాయి.
సెప్టెంబర్ 25 ఆదివారం అనంత్ భార్య సంగీతను నువ్వు నల్లగా ఉన్నావు.. అందంగా లేవు అని అనడంతో వారిద్దరి మధ్య తీవ్రంగా గొడవ జరిగింది. ఆగ్రహానికి గురైన భార్య.. అక్కడే పక్కకు ఉన్న గొడ్డలితో భర్తపై దాడి చేసింది. భర్త మర్మాంగాన్ని కోసేసింది. ఆ తర్వాత ప్లాన్ ప్రకారం తన భర్తను ఎవరో హత్య చేశారంటూ ఆమె గ్రామస్థులను నమ్మించే ప్రయత్నం చేసింది.
అయితే పోలీసులకు అనుమానం రావడంతో ఆమెన తమదైన శైలిలో విచారించడంతో సంగీత నిజం ఒప్పుకుంది. పోలీసులు నిందితురాలిని అరెస్టు చేసి రిమాండ్ కు పంపారు. మృతుడు అనంతక్ సంగీత రెండో భార్య. మొదటి భార్య చనిపోవడంతో అతడు రెండో వివాహం చేసుకన్నట్లు సమాచారం.