Crime News: భర్తకు ఫుల్గా మద్యం తాగించింది.. ప్రియుడికి ఫోన్ చేసి పిలిపించింది.. కట్ చేస్తే..
వివాహేతర సంబంధానికి అడ్డుకున్నాడని ప్రియడితో కలిసి కట్టకున్న భర్తనే హత్య చేసింది ఓ మహిళ. ఈ దారుణ ఘటన ఢిల్లీ జరిగింది. తూర్పు ఢిల్లీలోని మండవాలి సురేష్ అతని భార్య హేమ, కుమారుడు నిశాంత్ కలిసి నివాస్తున్నాడు. సరేష్ స్థానికంగా ఉండే ఓ దుకాణంలో పని చేస్తుండగా.. హేమ కూలీ పనులకు వెళ్లేది. ఇలా కూలీకి వెళ్లిన చోట్ హేమకు సచిన్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. ఫోన్ నెంబర్లు ఇచ్చి పుచ్చుకున్నారు. ఇలా వారి పరిచయం వివాహేతర సంబంధంగా మారింది.

మద్యం తాగించి
కొద్ది రోజుల తర్వాత ఈ విషయం సురేష్ కు తెలిసిపోయింది. దీంతో అతను హేమను హెచ్చరించాడు. హేమ కొద్ది రోజులు సచిన్ ను దూరం పెట్టింది. కానీ మళ్లీ వారు వివాహేతర సంబంధాన్ని కొనసాగించారు. ఈ క్రమంలో సురేష్ ను అడ్డు తొలగించుకోవాలని వారు నిర్ణయించుకున్నారు. మద్యం తాగించి హత్య చేయాలని ప్లాన్ చేశారు.

కట్టేసి కొట్టారు.
ప్లాన్ ప్రకారం హేమ మద్యం కొనుగోలు చేసింది. చికెన్ తో వంట చేసింది. సురేష్ దుకాణం నుంచి రాగానే చికెన్ తో పాటు మందు ముందు పెట్టింది. దీంతో సురేష్ చికెన్ తో పాటు మద్యం తాగాడు. హేమ అతన్ని ఇంకా తాగాలంటూ బలవంతం చేసింది. దీంతో అతను బాగా తాగి స్పృహ తప్పాడు. ఆ వెంటనే హేమ తన ప్రియుడి సచిన్ కు ఫోన్ చేసి రావాలని చెప్పింది. వెంటనే అక్కడికి చేరుకున్న సచిన్ హేమతో కలిసి సురేష్ గొంతుకు చున్నీతో కట్టేసి బాగా కొట్టారు.

ఆస్పత్రికి
ఆ తర్వాత సురేష్ ను ఆస్పత్రికి తరలించారు. తన భర్త బాగా తాగి రోడ్డుపై నడుచుకుంటు వస్తుంటే యాక్సిడెంట్ అయిందని వైద్యులకు తెలిపింది. అప్పటికే సురేష్ చనిపోయాడని వైద్యులు తెలిపారు. ఇది రోడ్డు ప్రమాదం కావడంతో పోలీసులు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. మృతదేహాన్ని అతడి భార్య హేమ, సోదరుడికి అప్పగించారు. పోస్ట్ మార్టం రిపోర్టులో మృతదేహం తల, మెడ, ఛాతిపై దెబ్బలు ఉన్నాయని.. చనిపోవడానికి కారణం కొట్టడమే అని తేలింది. దీంతో వెంటనే పోలీసులు హేమను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం తెలిసింది.












Click it and Unblock the Notifications