ఇన్ఫోసిస్ క్యాంపస్లో మహిళపై రేప్
పూణే: ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీ ఇన్ఫోసిస్ క్యాంపస్ లో ఓ మహిళ అత్యాచారాని గురైయ్యిందని పోలీసులు కేసు నమోదు చేశారు. పూణేలోని ఇన్ఫోసిస్ ఫేజ్-1 క్యాంపస్ లో ఆదివారం ఈ సంఘటన జరిగిందని పోలీసులు చెప్పారు.
ఈ నెల 27వ తేదిన హౌస్ కీపింగ్ చేస్తున్న మహిళ మీద ఇన్ఫోసిస్ క్యాంపస్ లో అత్యాచారం జరిగింది. మహిళ ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. బాధితురాలు ఇచ్చిన సమాచారంతో కొందరిని అదుపులోకి తీసుకున్నారు.
తరువాత ఇద్దరిని అరెస్టు చేసి విచారణ చేస్తున్నామని పోలీసులు అన్నారు. అయితే అరెస్టు చేసిన ఇద్దరి వివరాలు వెల్లడించడానికి పోలీసు అధికారులు నిరాకరించారు. కేసు విచారణలో ఉన్నందున ఇప్పుడే పూర్తి వివరాలు చెప్పలేమని పోలీసులు అన్నారు.
మహిళను, అరెస్టు చేసిన ఇద్దరినీ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించామని పోలీసులు చెప్పారు. ఇన్ఫోసిస్ కార్యాలయంలో ఆదివారం ఉద్యోగులు చాల తక్కువ మంది ఉంటారని, ఆ సమయంలో అత్యాచారం చేసి ఉంటారని పోలీసులు తెలిపారు.