శ్రీలంక పేలుళ్లలో భారతీయ మహిళ దుర్మరణం! బంధువుల ఇంట్లో శుభకార్యానికి వెళ్లి..!
మంగళూరు: శ్రీలంకలో వరుసగా చోటు చేసుకున్న బాంబు పేలుళ్ల ఘటనల్లో ఓ భారతీయురాలు దుర్మరణం పాలయ్యారు. ఆమెను కర్ణాటకలోని మంగళూరుకు చెందిన రెజీనా ఖాదర్ కుక్కాడి. వయస్సు 58 పంవత్సరాలు. ఆమె స్వస్థలం సూరత్ కల్. మంగళూరు సమీపంలోని బైకంపాడికి చెందిన అబ్దుల్ ఖాదర్ కుక్కాడిని వివాహం చేసుకున్నారు. రెజీనా తన భర్త అబ్దుల్ ఖాదర్ తో కలిసి చాలాకాలం పాటు బైకంపాడిలో నివాసం ఉన్నారు. అనంతరం- కుక్కాడి దంపతులు దుబాయ్ కు వెళ్లిపోయారు.
రెజీనా కుక్కాడి పూర్వీకులు శ్రీలంకకు చెందిన వారు కావడంతో ఆ దేశంలో ఆమెకు పెద్ద సంఖ్యలో బంధువులు, కుటుంబ స్నేహితులు ఉన్నారు. వారిలో చాలామంది కొలంబోలో నివసిస్తున్నారు. బంధువుల ఇంట్లో శుభకార్యానికి హాజరు కావడానికి రెజీనా కుక్కాడి.. శుక్రవారం కొలంబోకు వెళ్లారు.

అక్కడి షాంగ్రిలా హోటల్ లో బస చేశారు. ఆమె భర్త అబ్దుల్ ఖాదర్ ఆదివారం నాడు దుబాయ్ నుంచి కొలంబోకు చేరుకోవాల్సి ఉంది. ఆదివారం షాంగ్రిలా హోటల్ పై జరిగిన ఆత్మాహూతి దాడిలో రెజీనా మృత్యువాత పడ్డారు. హోటల్ షాంగ్రిలాపై ఉగ్రవాదిని జెహ్రెయిన్ గా గుర్తించినట్లు శ్రీలంక భద్రతాధికారులు ఇదివరకే ప్రకటించారు. ఐసిస్ ఉగ్రవాద సంస్థకు చెందిన ఆత్మాహూతి దళ సభ్యుడని అధికారులు తేల్చారు.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది












Click it and Unblock the Notifications