ఐటీ హబ్ లో లేడీస్ పీజీలో యువతి దారుణ హత్య, తప్పించుకున్న గర్ల్ ఫ్రెండ్
బెంగళూరులోని కోరమంగళలోని పీజీలో నివాసముంటున్న బీహార్ రాష్ట్రానికి చెందిన యువతిని గొంతు కోసి దారుణంగా హత్య చేసిన ఘటనలో కలకలం రేపుతోంది. యువతి ప్రియుడే ఇక్కడికి వచ్చి హత్య చేసినట్లు పోలీసులు మొదట అనుకున్నారు. అయితే ఈ యువతికి హంతకుడికి సంబంధం లేదని వెలుగు చూడటంతో పోలీసులు షాక్ అయ్యారు. ఇంతకీ, హత్యకు గురైన యువతికి, హంతకుడికి మధ్య ఉన్న సంబంధం ఏంటో తెలుసా?.
ఐటీ హబ్ బెంగళూరు నగరంలోని కోరమంగళలో రాత్రి 11.10 నుంచి 11.30 గంటల సమయంలో పీజీలోకి కత్తితో ప్రవేశించిన నిందితుడు అభిషేక్ మూడో అంతస్తులోని గదిలో ఉన్న యువతి గొంతు కోసి పరారయ్యాడు. దీంతో బీహార్కు చెందిన కృతి కుమారి(24) అనే యువతి రక్తస్రావంతో అక్కడికక్కడే మృతి చెందింది. కోరమంగళ పోలీసులు, సౌత్ ఈస్ట్ డివిజన్ డీసీపీ సారా ఫాతిమా సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించి వివరాలు సేకరించారు.

పరిచయస్తులే కృతి కుమారిని హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానించారు. పీజీలో భద్రతా వైఫల్యమే ఈ ఘటనకు ప్రధాన కారణం అని పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనపై కోరమంగళ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.హత్యకు పాల్పడిన యువకుడు అభిషేక్ హత్యకు గురైన కృతి కుమారికి ప్రేమికుడో లేక పరిచయస్తుడో అయి ఉంటాడని మొదట పోలీసులు అన్నారు. అయితే వారిద్దరికీ ఎలాంటి సంబంధం లేదని పోలీసుల విచారణలో తెలిసింది.
కృతి కుమారిని హత్య చేసిన యువకుడు భోపాల్కు చెందిన అభిషేక్ అని పోలీసులు గుర్తించారు. ఈ అభిషేక్ కొన్నేళ్ల క్రితం తాను పనిచేస్తున్న కంపెనీలో సహోద్యోగి అయిన ఓ యువతిని ప్రేమించాడు. దీంతో ఇద్దరూ ఒకే పీజీలో సహజీవనం సాగించారు. అయితే అభిషేక్ ఉద్యోగం వదిలేసి కొన్ని నెలల క్రితం భోపాల్ వెళ్లాడు. అంతేకాకుండా తన ప్రియురాలిని చూసేందుకు తరచూ బెంగళూరుకు వచ్చేవాడు.
అయితే ఏ పనీ లేకుండా నిరుద్యోగిగా తిరుగుతున్న అభిషేక్ ను బెంగళూరులో ఉద్యోగంలో చేరమని అతని ప్రియురాలు కోరింది. అయితే తాను ఉద్యోగంలో చేరానని అభిషేక్ అతని ప్రియురాలికి అబద్ధం చెప్పాడు. మళ్లీ ఆమెను కలిసేందుకు వచ్చినప్పుడు అతడు అబద్ధం చెప్పాడని అతని ప్రియురాలికి తెలిసిపోయింది. అభిషేక్ కు దూరంగా ఉండేందుకు అతని ప్రియురాలు ప్రయత్నించింది. అనంతరం ప్రియురాలు ఉంటున్న పీజీ వద్దకు వచ్చిన అభిషేక్ వీరంగం సృష్టించాడు.

అప్పుడు, అభిషేక్ ప్రియురాలికి ఇప్పుడు హత్యకు గురైన కృతి కుమారి సహాయం చేసింది. ఇద్దరూ స్నేహితులు కావడంతో కృతి కుమారి తన స్నేహితురాలు పీజీలో ఉంటున్న పీజీకి వచ్చి ఉండమని సలహా ఇచ్చింది. వెంటనే అభిషేక్ గర్ల్ ఫ్రెండ్ పీజీ వదిలేసి కృతి కుమారి లేడీస్ పీజీలో ఉండిపోయింది. అభిషేక్ వారం రోజుల క్రితం తన ప్రియురాలిని చూసేందుకు వెళ్లాడు. నీ ప్రియురాలు పీజీ మార్చిందని, తాను 3వ అంతస్తులోని ఓ గదిలో ఉంటున్నానని కృతి కుమారి అతనికి చెప్పింది.
ఉద్యోగంలో చేరడం లేదనే విషయమై అభిషేక్, అతని ప్రియురాలి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఆమెకు కోపం వచ్చి అతనితో మాట్లాడటం మానేసింది. తాను, తన ప్రియురాలు దూరం కావడానికి ఆమె రూమ్ మెంట్ కృతి కుమారి కారణం అని అభిషేక్ రగిలిపోయాడు. అభిషేక్ కృతి కుమారి ఉంటున్న పీజీలోకి ప్రవేశించాడు. అభిషేక్ అతని ప్రియురాలిని చంపాలని నిర్ణయించుకున్నాడు.
పీజీ దగ్గర సెక్యూరిటీ గార్డు లేకపోవడంతో అభిషేక్ ఎలాంటి ఇబ్బంది లేకుండా పీజీ లోపలికి వెళ్లి 3వ అంతస్తులోకి వెళ్లాడు. అక్కడ తన ప్రియురాలిని చంపాలని నిశ్చయించుకుని తలుపు తట్టాడు. అయితే ప్రియురాలికి బదులు కృతి కుమారి వచ్చి తలుపు తీస్తుంది. తలుపు తెరిచిన వ్యక్తి ఎవరో అనికూడా చూడకుండా అభిషేక్ కత్తితో కృతి కుమారి మెడ కోసి ఉంటాడని పోలీసు అధికారులు అనుమానిస్తున్నారు. గొంతు పూర్తిగా కేసివేయడంతో కొద్దిసేపటికే కృతి కుమారి రక్తస్రావంతో అదే రూమ్ లో మృతి చెందింది. ప్రస్తుతం నిందితుడి కోసం బెంగళూరులోని కోరమంగళ పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.
-
తెలుగులో ఇంత బోల్డ్ కంటెంటా...బాబోయ్ అన్ని ఆ సీన్లే..! -
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్!












Click it and Unblock the Notifications