సర్వత్రా ఉత్కంఠ: అరుషి హత్య కేసులో కోర్టు తీర్పు నేడే..
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అరుషి తల్వార్ హత్య కేసులో అలహాబాద్ హైకోర్టు గురువారం కీలకమైన తీర్పు ఇవ్వనుండటంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
Recommended Video

అలహాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అరుషి తల్వార్ హత్య కేసులో అలహాబాద్ హైకోర్టు గురువారం కీలకమైన తీర్పు ఇవ్వనుండటంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
నోయిడాలోని జలవాయి విహార్లో 2008 మే 16న అరుషి తల్వార్(14) హత్యకు గురైంది. అరుషిని ఆమె తల్లిదండ్రులైన నూపుర్ తల్వార్, రాజేష్ తల్వార్లు ఇంటి పనిమనిషి హేమరాజ్తో కలిసి హత్య చేసినట్టు ఉత్తరప్రదేశ్ కోర్టు 2013లో తీర్పుచెబుతూ నూపుర్, రాజేష్ తల్వార్లకు జీవిత ఖైదు విధించింది.

మొదట పనిమనిషిపై అనుమానం...
అరుషి హత్యకేసు అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తొలుత పనిమనిషి హేమరాజే ఈ హత్యకు పాల్పడినట్టు అనుమానించారు. అయితే అరుషి హత్యకు గురైన ఫ్లాట్లోని టెర్రస్పై రెండ్రోజుల తర్వాత హేమరాజ్ విగతజీవుడై పడిఉండటంతో కేసు మరో మలుపు తిరిగింది.

తల్లిదండ్రులే నిందితులయ్యారు...
దీంతో అందరి అనుమానం తల్వార్ దంపతులపైకి మళ్లింది. ఆ దిశగా దర్యాప్తు జరిపిన పోలీసులు అరుషి, హేమరాజ్ హత్యలకు రాజేష్, నూపర్లే కారణమనే నిర్ధారణకు వచ్చారు. అయితే దర్యాప్తును తప్పుదారి పట్టిచేందుకు పోలీసులే ఇలాంటి నేరాభియోగాలు మోపారంటూ తల్వార్ దంపతులు, వారి సన్నిహత మిత్రులు చెబుతూ వచ్చారు.

సరైన సాక్ష్యాలు లేవంటూ...
దీంతో ఈ కేసు ఉత్తరప్రదేశ్ పోలీసుల నుంచి సీబీఐ చేతికి వెళ్లింది. 2009లో సీబీఐ ఈ కేసును మరో టీమ్కు అప్పగించగా చివరకు కేసును మూసేయాల్సిందిగా ఆ టీమ్ సిఫారసు చేసింది. పరిస్థితుల ఆధారంగా రాజేష్ తల్వార్ ను అనుమానితుడిగా పేర్కొన్న సీబీఐ టీమ్ సరైన సాక్ష్యాలు లేనందున నేరాభియోగాలు మోపేందుకు నిరాకరించింది.

ఆరుషి తల్లిదండ్రులకు జీవిత ఖైదు...
అయితే సీబీఐ ప్రత్యేక కోర్టు మాత్రం ఈ కేసు మూసివేతకు ఒప్పుకోలేదు. అందుబాటులో ఉన్న సాక్ష్యాల ఆధారంగానే అరుషి తల్లిదండ్రులను ప్రాసిక్యూట్ చేయాలని ఆదేశించింది. దీంతో 2013లో అరుషి తల్లిదండ్రులకు జీవిత ఖైదు విధించారు.

జైలుపాలైన దంపతులు...
2008 మే 23న అరుషి తండ్రి రాజేష్ తల్వార్ ను మొదటిసారి యూపీ పోలీసులు అరెస్టు చేసి దస్నా జైలుకు పంపారు. అయితే 2008 జూలై 11న అతడ్ని విడిచిపెట్టారు. అనంతరం 2012లో రాజేష్ భార్య నూపుర్ తల్వార్ ఘజియాబాద్ కోర్టు ముందు లొంగిపోవడంతో ఆమెను కూడా దస్నా జైలుకు పంపారు.

అరుషి తల్లిదండ్రుల అప్పీలు...
అరుషి తల్లిదండ్రులు ఈ తీర్పుపై చేసుకున్న అప్పీల్పై జస్టిస్ బీకే నారాయణ, జస్టిస్ ఏకే మిశ్రాలతో కూడిన అలహాబాద్ హైకోర్టు బెంచ్ గత సెప్టెంబర్లో విచారణ జరిపి తీర్పును రిజర్వ్ చేసింది. అరుషిని హత్య చేసింది ఆమె తల్లిదండ్రులేనా? అన్న దానిపై ఈ తీర్పు వెలువడనుంది.
-
పేలిన బంగారం ధరల బాంబు- తారాజువ్వ -
IPL 2026: ముంబై ఇండియన్స్ కొంపముంచిన బుడ్డోడు! -
చెన్నై సూపర్ కింగ్స్ కు భారీ ఉపశమనం- పులి వచ్చింది -
ఓటీటీలోకి తెలుగు బోల్డ్ మూవీ.. అర్జున్ రెడ్డికి మించి.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్ -
today rashiphalalu: నేడు ముఖ్య గ్రహాల గోచారంతో వీరి పంట పండుతుంది.. మీరున్నారా? -
తమిళనాడు, కేరళ, బెంగాల్, అసోంలో గెలుపెవరిది ? సీఓటర్ తాజా సర్వే..! -
'హ్యాపీ బర్త్ డే బావా'.. ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్ట్.. బన్ని షాకింగ్ రిప్లై.. -
Tamil Nadu Survey: తమిళనాడు విజేతను తేల్చేసిన ఏబీపీ సర్వే-ఎవరికెన్ని సీట్లంటే..? -
రైతు భరోసా రెండు, మూడో విడత నిధుల జమ షెడ్యూల్ ఫిక్స్- ఎవరికి ఎప్పుడు..!! -
అల్లు అర్జున్.. ఇండియన్ స్క్రీన్ పై ఎప్పుడూ చూడని రోల్: గగుర్పాటు -
కేబినెట్ భేటీలో ప్రధాని మోదీ సంచలన నిర్ణయాలు ఇవే.. -
అమరావతికి కేంద్రం మరో భారీ గుడ్ న్యూస్, ఈ సారి ఏకంగా..!!












Click it and Unblock the Notifications