'ఏబీపీ-సీఎస్డీఎస్' ఎగ్జిట్ పోల్: బీజేపీ అతిపెద్ద పార్టీ
ఉత్తరప్రదేశ్లో హంగ్ వస్తుందని 'ఏబీపీ - సీఎస్డీఎస్' ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలు చెబుతున్నాయి. అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరిస్తుందని తెలిపింది.
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్లో హంగ్ వస్తుందని 'ఏబీపీ - సీఎస్డీఎస్' ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలు చెబుతున్నాయి. అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరిస్తుందని తెలిపింది.
రాష్ట్రాల వారిగా మేజిక్ ఫిగర్లు.. యూపీలో 202, పంజాబ్లో 59, మణిపూర్లో 31, గోవాలో 21, ఉత్తరాఖండ్లో 36.
'ఏబీపీ - సీఎస్డీఎస్' ఎగ్జిట్ పోల్ ప్రకారం యూపీలో బీజేపీకి 164 నుంచి 176 సీట్లు వస్తాయి. ఎస్పీ కాంగ్రెస్ పార్టీలకు 156 నుంచి 169 సీట్లు వస్తాయి. బీఎస్పీకి 60-72 సీట్లు వస్తాయి.

ఈ సర్వే ప్రకారం ఏ పార్టీకి కూడా మేజిక్ ఫిగర్ (202) స్థానాలు రావు. ప్రస్తుతం అందరి దృష్టి ఉత్తర ప్రదేశ్ ఎన్నికల పైనే ఉంది. ఈ ఎన్నికలు 2019కి సెమీ ఫైనల్స్ వంటివి.
2014 లోకసభ ఎన్నికల్లో బీజేపీ 73 స్థానాలు గెలుపొందింది. నరేంద్ర మోడీ ప్రధాని కావడంలో ఈ రాష్ట్రం పాత్రనే అత్యధికం.
ఇదిలా ఉండగా యూపీలో ఏ పార్టీకీ మెజార్టీ రావడం లేదు. ఎన్నికల సమయంలో బీజేపీ - బీఎస్పీ అలయెన్స్ పైన చర్చ జరిగింది. కానీ మాయావతి తిప్పికొట్టారు. ఇప్పటికే బీఎస్పీ మద్దతు తీసుకునేందుకు అఖిలేష్ సిద్ధమని ప్రకటించారు.
-
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!!












Click it and Unblock the Notifications