Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఏబీపీ మూడ్ ఆఫ్ ది నేషన్-సర్వే: యూపీ, మహారాష్ట్ర, బీహార్ ఎవరు ఎన్ని సీట్లలో గెలుస్తారంటే?

న్యూఢిల్లీ: 2019 లోకసభ ఎన్నికల్లో ఉత్తర ప్రదేశ్‌లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే 31 లోకసభ స్థానాలు, కాంగ్రెస్ నేతృత్వంలోని గ్రాండ్ అలయెన్స్ 41 సీట్లు గెలుచుకుంటుందని ఏబీపీ దేశ్ కా మూడ్ సర్వేలో వెల్లడైంది. ఏబీపీ ఛానల్ దేశ్ కా మూడ్ పేరుతో సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో యూపీలో బీజేపీకి భారీ షాక్ తగలనుందని తేలింది.

వచ్చే ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీలు వేర్వేరుగా పోటీ చేస్తే బీజేపీ మళ్లీ డెబ్బై స్థానాల వరకు గెలుచుకుంటుందని ఈ సర్వేలో వెల్లడైంది. విపక్షాలు కలిస్తే మాత్రం షాక్ తగలనుందని తేలింది. వేర్వేరుగా పోటీ చేస్తే ఎన్డీయేకు 70 సీట్లు, యూపీఏకు 2, సమాజ్‌వాది పార్టీకి 4, మాయావతి నేతృత్వంలోని బీఎస్పీకి 4 సీట్లు రానున్నాయని సర్వేలో తేలింది. పార్టీలు కలిసి పోటీ చేస్తే మాత్రం బీజేపీకి 31, కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీలకు 44 సీట్లు వస్తాయని తేలింది.

ABP DeshKaMood survey: NDA to win 31, Grand Alliance 44 in UP, if Mahagatabandhan formed

48 లోకసభ స్థానాలు ఉన్న మహారాష్ట్రలో పార్టీలు వేర్వేరుగా పోటీ చేస్తే... బీజేపీ 23 సీట్లు, కాంగ్రెస్ 14 సీట్లు, శివసేన 5 సీట్లు, శరద్ పవాల్ నేతృత్వంలోని ఎన్సీపీ 6 సీట్లు గెలుచుకుంటుందని సర్వేలో తేలింది. అలా కాకుండా శివసేన, బీజేపీలు కలిసి, కాంగ్రెస్, ఎన్సీపీలు కలిస్తే ఎన్డీయేకు 28 సీట్లు, యూపీఏకు 20 సీట్లు వస్తాయని తేలింది.

40 సీట్లు ఉన్న బీహార్‌లో ఎన్డీయే కూటమికి 36 సీట్లు, యూపీఏ కూటమికి 6 సీట్లు వస్తాయని సర్వేలో వెల్లడైంది. కాగా, ఏబీపీ దేశ్ కా మూడ్ పేరుతో వరుసగా సర్వేలు నిర్వహిస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+