పోలీసులను ఆశ్రయించిన హీరో విశాల్, వారిని ఏం చేశారో ? భయంగా ఉంది !
చెన్నై: ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో తాను పోటీ చెయ్యడానికి మద్దతుగా నా నామినేషన్ పత్రాల్లో సంతకాలు చేసిన సుమతి, దీపన్ కనపడటం లేదని, వారి ఆచూకి చెప్పండి అంటూ బహుబాష నటుడు, నడిగర్ సంఘం ప్రధాన కార్యదర్శి, తమిళ సినీ నిర్మాతల సంఘం అధ్యక్షుడు విశాల్ చెన్నై నగర పోలీసులను ఆశ్రయించాడు.
ఎన్నికల కమిషన్ అధికారులు ఇచ్చిన గడువు పూర్తి కావడంతో ఇక తాను ఆర్ కే నగర్ శాసన సభ ఉప ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి అవకాశం చాల తక్కువగా ఉందని పసిగట్టిన హీరో విశాల్ పరోక్షంగా తమిళనాడు ప్రభుత్వం మీద విమర్శలు గుప్పించారు.

తాను ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో పోటీ చేసినా, చెయ్యకపోయినా ఎలాంటి ఇబ్బంది లేదని, తనకు మద్దతు తెలిపిన సుమతి, దీపన్ క్షేమంగా ఉంటే చాలని హీరో విశాల్ అంటున్నారు. ప్రజాస్వామ్యం మాత్రం ఓడిపోయిందని విశాల్ ఆరోపించారు.
తన నామినేషన్ పత్రాలపై సంతకాలు పెట్టిన తన మద్దతుదారులు సుమతి, దీపన్ ఆచూకి తేలియడం లేదని హీరో విశాల్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆ ఇద్దరినీ గురువారం మద్నాహ్నం 3 గంటలకు ఎన్నికల కమిషన్ ముందు హాజరుపరచడానికి, వారికి ఆ సమాచారం ఇవ్వాలని మీడియా ద్వారా మనవి చేసినా ప్రయోజనం లేదని విశాల్ విచారం వ్యక్తం చేశారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications