IRCTC కొంప కొల్లేరే ఇక: రైలు టికెట్ల అమ్మకాల్లో అదాని ఎంట్రీ
ముంబై: రైలు ప్రయాణం చేయాలనుకునే వారికి మొట్టమొదటగా గుర్తుకొచ్చేది.. ఐఆర్సీటీసీ. క్షణాల్లో టికెట్లను బుక్ చేసుకోవడానికి మెజారిటీ ప్రయాణికులు దీని మీదే ఆధారపడతారు. వెబ్సైట్, మొబైల్ యాప్ ద్వారా ప్రతి సంవత్సరం సగటున 14 లక్షల వరకు టికెట్లను అమ్ముతుంటుంది ఐఆర్సీటీసీ. ఒక రోజులో గరిష్ఠంగా 50,000 టికెట్లను విక్రయించిన చరిత్ర దీనికి ఉంది.
అలాంటి ఐఆర్సీటీసీ తన ఆధిపత్యాన్ని కోల్పోయే ప్రమాదంలో పడింది. దీనికి కారణాలు అనేకం. ప్రత్యామ్నాయ వనరులు అనేకం అందుబాటులోకి రావడం, అవన్నీ కూడా ప్రయాణికులకు ఆఫర్లను ఇస్తోండటం వల్ల ఐఆర్సీటీసీ కార్యకలాపాలు కొంత మందగించాయి. గో ఐబిబో, పేటీఎం, రెడ్ బస్, ట్రైన్మెన్, రెడ్ రైల్, ఇక్సిగో, మేక్ మై ట్రిప్.. వంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ నుంచి గట్టిపోటీని ఎదుర్కొంటోంది ఐఆర్సీటీసీ.

ఈ పరిణామాల మధ్య ఇప్పుడు ఈ పోటీ మరింత తీవ్రతరమైంది. దేశీయ పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ అదాని సారథ్యంలోని అదాని గ్రూప్ ఆఫ్ కంపెనీలు ఈ రంగంలో అడుగుపెట్టబోతోన్నాయి. రైల్వే టికెట్ల అమ్మకాల వ్యాపారాన్ని త్వరలో ఆరంభించబోతోన్నాయి. అదాని డిజిటల్ ల్యాబ్స్ పేరుతో ప్రత్యేకంగా ఓ విభాగాన్ని అదాని గ్రూప్స్ ఏర్పాటు చేశాయి. త్వరలోనే ఇది తన కార్యకలాపాలను మొదలుపెట్టబోతోంది.
ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆన్లైన్ ట్రైన్ టికెటింగ్ ప్లాట్ఫామ్లల్లో ఒకటైన ట్రైన్మెన్ను అదాని ఎంటర్ప్రైజెస్ టేకోవర్ చేయనుంది. అందులో వందశాతం పెట్టుబడులను పెట్టనుంది. ట్రైన్మెన్ షేర్లన్నింటినీ కొనుగోలు చేయనుంది. అనంతరం దీనికి అదాని డిజిటల్ ల్యాబ్స్ అనే పేరు పెట్టనుంది. దీనికోసం ఎంత మొత్తాన్ని ఖర్చు చేయబోతోన్నామనేది అదాని ఎంటర్ప్రైజెస్ వెల్లడించలేదు.
ట్రైన్ మెన్ ప్లాట్ ఫామ్ను స్టార్క్ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వహిస్తోంది. ఈ స్టార్క్ కంపెనీని తాము వందశాతం మేర కొనుగోలు చేయనున్నట్లు అదాని ఎంటర్ప్రైజెస్ తెలిపింది. ఈ మేరకు సెక్యూరిటీ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాకు ప్రతిపాదనలను పంపించింది కూడా. స్టార్క్ ఎంటర్ప్రైజెస్తో షేర్ పర్ఛేజ్ అగ్రిమెంట్ను కుదుర్చుకున్నట్లు వివరించింది.
అదాని గ్రూప్ ఆఫ్ కంపెనీలు కూడా రైల్వే టికెట్ల అమ్మకాల రంగంలో అడుగుపెట్టడం వల్ల ఐఆర్సీటీసీ మరింత గట్టిపోటీని ఎదుర్కొంటుందనడంలో సందేహాలు అక్కర్లేదని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. తన ఆధిపత్యాన్ని పోగొట్టుకోవడానికి ఎంతో కాలం ఎదురు చూసే పరిస్థితి ఉండకపోవచ్చని అంచనా వేస్తోన్నాయి.
-
శ్రీకాకుళం వాసులకు రైల్వే గుడ్ న్యూస్- ఆ మూడు రైళ్లకు 3 కొత్త హాల్ట్ లు..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు












Click it and Unblock the Notifications