జర్నలిస్టులు అభిసార్ శర్మ,రాజు పారూలేకర్ పై అదానీ గ్రూప్ పరువు నష్టం చర్యలు

అదానీ గ్రూప్ జర్నలిస్టులు అభిసార్ శర్మ, రాజు పారులేకర్‌లపై పరువు నష్టం ఫిర్యాదులు దాఖలు చేసింది. తప్పుడు సమాచారం ప్రచారం చేశారనే ఆరోపణలతో ఈ ఫిర్యాదులు నమోదయ్యాయి. ఈ కేసులో విచారణ నిమిత్తం సెప్టెంబర్ 20న గాంధీనగర్ కోర్టుకు హాజరుకావాలని వారికి సమన్లు జారీ చేసింది.

గాంధీనగర్‌లోని మెజిస్ట్రేట్ కోర్టు, అదానీ గ్రూప్ దాఖలు చేసిన క్రిమినల్ పరువు నష్టం ఫిర్యాదుల మేరకు, జర్నలిస్టులు అభిసార్ శర్మ, రాజు పారులేకర్‌లకు సెప్టెంబర్ 20న వ్యక్తిగతంగా హాజరు కావాలని నోటీసులు జారీ చేసింది. తమ ప్రతిష్టను దెబ్బతీసేలా తప్పుడు, పరువు నష్టం కలిగించే కంటెంట్‌ను ప్రచారం చేశారని కార్పొరేట్ సంస్థ వీరిపై ఆరోపించింది.

గాంధీనగర్‌లోని జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ కోర్టు (అడలజ్ పోలీస్ స్టేషన్ పరిధి), ఈ ఇద్దరు వ్యక్తులకు నోటీసులు జారీ చేసి, సెప్టెంబర్ 20న హాజరు కావాలని ఆదేశించిందని అదానీ గ్రూప్ న్యాయవాది సంజయ్ ఠాకూర్ తెలిపారు.

భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (BNSS)లోని సెక్షన్ 223 ప్రకారం ఈ నోటీసులు జారీ అయ్యాయని ఠాకూర్ చెప్పారు. "నిందితుడికి విచారణకు అవకాశం ఇవ్వకుండా మెజిస్ట్రేట్ నేరంపై ఎటువంటి గుర్తింపు తీసుకోలేరు" అని ఈ సెక్షన్ పేర్కొంటుంది.

ఠాకూర్ మాట్లాడుతూ, "నోటీసు అందిన తర్వాత, ఇద్దరు వ్యక్తులు సెప్టెంబర్ 20న కోర్టు ముందు వ్యక్తిగతంగా లేదా వారి న్యాయవాదుల ద్వారా హాజరై వారి వాదనలు వినిపించాల్సి ఉంటుంది. శర్మ తన యూట్యూబ్ ఛానెల్‌లో పరువు నష్టం కలిగించే కంటెంట్‌ను అప్‌లోడ్ చేయగా, పారులేకర్ ఎక్స్ ప్లాట్‌ఫామ్‌లో పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలు చేశారు" అని అన్నారు.

భారతీయ న్యాయ సంహిత (BNS), 2023లోని సెక్షన్లు 356 (1, 2, 3)లను గ్రూప్ ఆశ్రయించిందని ఠాకూర్ తెలిపారు. ఇవి భారతీయ శిక్షా స్మృతి సెక్షన్లు 499, 500, 501కి సమానం.

"ఈ ఫిర్యాదులు ఆగస్ట్ 18, 2025న శర్మ అప్‌లోడ్ చేసిన ఒక యూట్యూబ్ వీడియోను సూచిస్తున్నాయి. అందులో అస్సాంలో వేల ఎకరాల భూమి అదానీకి కేటాయించబడిందని, సంస్థకు రాజకీయ అనుకూలతలు లభించాయని ఆరోపించారు. అలాగే జనవరి 2025 నుండి పారులేకర్ చేసిన ట్వీట్లు, రీట్వీట్లలో కూడా భూ కబ్జాలు, కుంభకోణాలు, అన్యాయమైన ప్రయోజనాల గురించి ఇలాంటి ఆరోపణలే ఉన్నాయి" అని ఠాకూర్ వివరించారు.

"నిరాధారమైన, తప్పుదారి పట్టించే ఆరోపణలు"గా అదానీ గ్రూప్ వీటిని కొట్టివేసింది. ప్రతివాదులు ఉటంకించిన గౌహతి హైకోర్టు ఉత్తర్వు తేదీ ఆగస్ట్ 12, 2025లో తమ కార్పొరేట్ సంస్థకు ఎటువంటి ప్రస్తావన లేదని పేర్కొంది.

"హైకోర్టు కేసులో కీలకమైన మహబల్ సిమెంట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు అదానీతో ఎటువంటి సంబంధం లేదని కూడా కంపెనీ స్పష్టం చేసింది" అని ఠాకూర్ తెలిపారు. కోర్టు ముందు సమర్పించిన సాక్ష్యాలలో శర్మ వీడియో, ట్రాన్స్క్రిప్ట్, పారులేకర్ సోషల్ మీడియా పోస్ట్‌లు, గౌహతి హైకోర్టు ఉత్తర్వు, సంబంధిత రికార్డులు ఉన్నాయి.

కేసులు విచారణకు స్వీకరించబడితే, ట్రయల్ జరగవచ్చని, అప్పుడు ఇద్దరు వ్యక్తులకు రెండేళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా లేదా రెండూ విధించవచ్చని ఠాకూర్ తెలియజేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+