వీళ్లు కదా లీడర్స్ అంటే:అక్కడ విమర్శనాస్త్రాలు.. ఇక్కడ నవ్వుల్ పువ్వుల్..!
అసెంబ్లీలో వాడీవేడీ చర్చ అనంతరం సీఎం యోగీ ఆదిత్యనాథ్ అఖిలేష్ యాదవ్లు స్పీకర్ ఏర్పాటు చేసిన భోజన కార్యక్రమంకు హాజరయ్యారు.
లక్నో: ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్, మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్లు ఒకే చోట కనిపించారు. ఇందులో వింతేముంది అంటారా.. వీరిద్దరూ ఒకే చోట చేరకముందు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధించుకున్నారు. వాగ్వాదంకు దిగారు. అసెంబ్లీ సమావేశం ముగిసిన తర్వాత ఇద్దరూ భోజనం దగ్గర కనిపించారు. అయితే ఈ భోజనం ఏర్పాటు చేసింది స్పీకర్ సతీష్ మహాన. ఇరు నేతల మధ్య వాగ్వాదం పీక్ స్టేజ్కు వెళ్లిపోవడంతో వారిమధ్య దూరంను తగ్గించి గొడవ సద్దుమణిగేలా చేసేందుకు ఈ భోజన కార్యక్రమం స్వయంగా స్పీకర్ ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా విడుదలయ్యాయి. అప్పటి వరకు యోగీ ఆదిత్యనాథ్, అఖిలేష్ యాదవ్లు కస్సు బుస్సుగా కనిపించినప్పటికీ.. భోజనం దగ్గర చేరుకునే సరికి ఇద్దరి ముఖాల్లో నవ్వు కనిపించింది. పరస్పర గౌరవంతో ఇరునేతలు మాట్లాడుకున్నారు.
రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, మిత్రులు ఉండరు. రెండు పార్టీల నాయకులు ఒకరినొకరు దూషించుకోవడం, ఒకరినొకరు మంచి చెడ్డలు అనడం వంటి సంఘటనలు తరచుగా కనిపిస్తాయి.ఆ తరువాత ఇద్దరు నాయకులు కలిసి కనిపిస్తారు. ఇదంతా రాజకీయ వైరమే కానీ వ్యక్తిగత వైరం కానే కాదు. రాజకీయంగా యోగీ ఆదిత్యనాథ్పై అఖిలేష్ యాదవ్ విమర్శలు సంధించడం అస్సలు ఆపలేదు. అదే సమయంలో ఎస్పీ అధినేత అఖిలేష్ను టార్గెట్ చేయడంలో సీఎం యోగీ ఆదిత్యనాథ్ కూడా తగ్గలేదు.













Click it and Unblock the Notifications