భగవంత్ మానా మజాకా ? 2016లో సిద్ధూ ముందు కామెడీ షో - ఈసారి ఏకంగా పొలిటికల్ షో
పంజాబ్ సీఎం కాబోతున్న ఆప్ నేత భగవంత్ సింగ్ మాన్ కూ, పీసీసీ అధ్యక్షుడిగా రాజీనామా చేసిన నవ్ జ్యోత్ సింగ్ సిద్ధూకు ఓ విషయంలో సాన్నిహిత్యం ఉంది. గతంలో ఓసారి సిద్ధూ ముందు కామెడీ షో చేసిన భగవంత్ మాన్.. ఈసారి మాత్రం సీరియస్ షో తో ఆయనకు దిమ్మదిరిగే షాకిచ్చారు.
పంజాబ్ లో కాంగ్రెస్ పార్టీతో పోరాడి ఆప్ ఘన విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించిన భగవంత్ మాన్ గతంలో స్టాండప్ కమెడియన్ గా పలు షోలు నిర్వహించారు. ఇదే క్రమంలో 2016లో నిర్వహించిన ఓ స్టాండప్ కామెడీ షోకు సిద్ధూ న్యాయనిర్ణేతగా వ్యవహరించారు. 'ద గ్రేట్ ఇండియన్ లాఫ్టర్' పేరుతో సాగిన ఆ షోలో పోటీ దారుగా వచ్చిన భగవంత్ మాన్ .. న్యాయనిర్ణేతగా ఉన్న సిద్ధూను మెప్పించేందుకు సర్వశక్తులొడ్డారు.
ఈ షోలో "రాజనీతి (రాజకీయం) అంటే ఏమిటని తాను ఒక రాజకీయ నాయకుడిని అడిగానని. అది ఎలా పరిపాలించాలో నిర్ణయించే చర్య అని అతను తనకు చెప్పాడని మాన్ అప్పట్లో షోలో చెప్పారు. అప్పుడు నేను గోర్మింట్ (ప్రభుత్వం) అంటే ఏమిటని అడిగాను. అతను అంటే ప్రతి సమస్యను (నిశితంగా చూసే) అని అర్థం. ఒక నిమిషం (నిమిషం) తర్వాత దానిని మరచిపోవడానికి," భగవంత్ మాన్ నవ్వాడు. అప్పట్లో మాన్ వేసిన ఈ జోక్ కు నవజ్యోత్ సింగ్ సిద్ధూ పగలబడి నవ్వారు. ఈ జోక్ సంవత్సరాల తరువాత వ్యంగ్యం యొక్క సరికొత్త రూపం మార్చుకుంటుందని అప్పుడు ఎవరూ ఊహించలేదు.
Recommended Video
ఇప్పుడు సీన్ కట్ చేస్తే పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ మెజారిటీ సాధించి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉంది. పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్ధిగా భగవంత్ మాన్ పంజాబ్ తదుపరి ముఖ్యమంత్రి కావడానికి సిద్ధంగా ఉన్నారు. మరోవైపు, ఈ ఎన్నికలలో అధికార కాంగ్రెస్ పేలవ ప్రదర్శనతో కుదేలైంది. దీంతో పాటు పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ స్వయంగా అమృత్సర్ ఈస్ట్లో ఓటమిపాలయ్యారు. దీంతో సిద్ధూను అప్పట్లో తన కామెడీతో నవ్వించిన భగవంత్ మాన్.. ఇఫ్పుడు రాజకీయాల్లో కోలుకోలేని దెబ్బతీశాడంటూ ఆయన అభిమానులు వాపోతున్నారు.