బేకరి లడ్డూలో మత్తు మందు, కాలేజ్ అమ్మాయికి ఇచ్చిన బాయ్ ఫ్రెండ్స్ ?
బెంగళూరు/ధావణగెరె: ఆమె ఇంకా మైనర్, బాగా చదువుకోవాలని, మంచి ఉద్యోగం చేస్తూ తన తల్లిదండ్రులను చూసుకోవాలని ఆమె చాలా కలలు కనేది. ఒంటరిగా ఉన్న ఓ యువతి జీవితంలోకి ఇద్దరు శాడిస్టులు ప్రవేశించారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఆ యువతితో జీవితం ఆ ఇద్దరి కారణంగా సర్వనాశనం కావడంతో ఆమె కుటుంబ సభ్యులు ఆర్తనాదాలు చేస్తున్నారు.
ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్న యువతికి మధు అనే యువకుడు పరిచయం అయ్యాడు. తనను ప్రేమించాలంటూ కొంతకాలం నుంచి ఆ కాలేజ్ అమ్మాయిని మధు చిత్రహింసలకు గురిచేసేవాడు. అయితే తాను బాగా చదువుకోవాలని, నిన్ను ప్రేమించడం సాధ్యం కాదని, మనం స్నేహితులుగా ఉందామని కాలేజ్ అమ్మాయి ఆమెకు పరిచయం అయిన మధుకు చెబుతూ వచ్చింది.

అయితే దీనికి ఒప్పుకోని మధు ఆ అమ్మాయితో అప్పుడప్పుడు సరసాలాడాడు. నిందితుడు మధు దావణగెరె జిల్లాలోని జగలూరు నివాసి. వీధుల్లో రోడ్ రోమియోగా ఉండే మధు ఈ కాలేజీకి వెళ్తున్న మైనర్ బాలిక వెనుక పడిపోయాడు. నిత్యం ప్రేమించాలంటూ యువతిని వేధించేవాడు. కానీ ఆమె మాత్రం ఇంతకాలం మధు ప్రేమను తిరస్కరించింది.
దీంతో ఆగ్రహించిన శాడిస్టు వన్ సైడ్ లవర్ మధు. అతని స్నేహితుడు నాగేంద్ర స్వామితో కలిసి ఓ స్కెచ్ వేశాడు. బేకరీలో స్వీట్లు కొనుగోలు చేసిన నిందితులు అందులో మత్తు మందు వేసి ఇంటర్ చదువుతున్న కాలేజ్ అమ్మాయికి ఇచ్చారు. మధు మీద నమ్మకంతో కాలేజ్ అమ్మాయి ఆ స్వీట్లు తినేసింది. మత్తుమందు కలిపిన స్వీట్లు తిన్న తరువాత కాలేజ్ అమ్మాయి మత్తులోకి జారుకుంది.

ఆ సమయంలో మధు, అతని స్నేహితుడు నాగేంద్ర కలిసి ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించి ముగ్గురు ఏకాంతంగా ఉన్న సమయంలో కొన్ని వీడియో తీశారు. అనంతరం ఆ వీడియోలు కాలేజ్ అమ్మాయికి చూపించిన మధు మేము చెప్పినట్లు వినాలని, మేము ఎక్కడికి పిలిస్తే అక్కడికి రావాలని చెప్పి ఆమెను బ్లాక్ మెయిల్ చేశారు.
మేము చెప్పినట్లు వినకపోతే నీ నగ్న వీడియోలు సోఫల్ మీడియాలో లీక్ చేస్తామని కాలేజ్ అమ్మాయిని బెదిరించారు.ఈ ఇద్దరు శాడిస్టుల చిత్రహింసలు తీవ్రరూపం దాల్చడంతో విసిగిపోయిన యువతి ఆత్మహత్యకు యత్నించింది. ఆగస్టు 28వ తేదీన ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. తల్లిదండ్రులు వెంటనే కాలేజ్ అమ్మాయిని ఆస్పత్రిలో చేర్పించారు.

అయితే చికిత్స ఫలించక కాలేజ్ విద్యార్థిని మృతి చెందిందని పోలీసులు అన్నారు. కాలేజ్ అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడంతో మధు, అతని స్నేహితుడు నాగేంద్ర పరారైనారని, కేసు విచారణలో ఉందని దావణగెరె పోలీసు అధికారులు తెలిపారు. ఇద్దరు శాడిస్టు యువకులు యువతి నగ్న వీడియోలు అడ్డం పెట్టుకుని ఆమెను బ్లాక్ మెయిల్ చెయ్యడంతో కాలేజ్ అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడం దావణగెరెలో కలకలం రేపింది. .
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications