వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ 23 మందిపై విమర్శలు... తక్షణం రాహుల్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలన్న అహ్మద్ పటేల్...

|
Google Oneindia TeluguNews

కాంగ్రెస్ సారథ్య బాధ్యతలపై నెలకొన్న సంక్షోభం ఆ పార్టీని కుదిపేస్తోంది. ఓవైపు పార్టీలో వ్యవస్థీకృత సంస్కరణలు అవసరమన్న వాదన... మరోవైపు మెజారిటీ కాంగ్రెస్ శ్రేణులు ఇప్పటికీ గాంధీ కుటుంబ నాయకత్వాన్నే బలపరుస్తున్న పరిస్థితులు... చివరకు ఈ పరిణామాలు ఎటు దారితీస్తాయోనన్న గందరగోళం పార్టీని వెంటాడుతోంది. ఇక ఇదే అదనుగా కాంగ్రెస్ మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసేందుకు బీజేపీ దూకుడైన వ్యాఖ్యలతో విరుచుకుపడుతోంది.

Recommended Video

Congress President: గాంధీయేతర వ్యక్తికే పగ్గాలు ఖాయమా? Rahul Gandhi, Priyanka Gandhi అనాసక్తి

తాజా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో ఆ పార్టీ సీనియర్ నేత అహ్మద్ పటేల్.. తక్షణమే అధ్యక్ష బాధ్యతలు చేపట్టాల్సిందిగా రాహుల్ గాంధీని కోరారు. అంతేకాదు,అసమ్మతి స్వరం వినిపించిన 23 మంది సీనియర్ నేతలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గులాంనబీ ఆజాద్,ముకుల్ వస్నిక్,ఆనంద్ శర్మ లాంటి నేతలు పార్టీలో ఎన్నో కీలక పదవులను చేపట్టారని గుర్తుచేశారు. అలాంటిది ఇప్పుడు పార్టీలో మార్పులు అవసరమంటూ అధిష్టానానికి వారు లేఖ రాయడాన్నిఆయన తప్పు పట్టారు.

Ahmed Patel criticises dissenters, says Rahul Gandhi should be Congress president

మాజీ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దారామయ్య కూడా రాహుల్ గాంధీనే తిరిగి పగ్గాలు చేపట్టాలని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు సోమవారం ఆయన పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి లేఖ రాశారు. ఒకవేళ మీ ఆరోగ్యం సహకరించకపోతే... అధ్యక్ష పదవి చేపట్టడం కోసం రాహుల్‌ను ఒప్పించాలని లేఖలో సోనియాను కోరారు. అదే సమయంలో ఏఐసీసీ అధ్యక్షురాలిగా మీరే కొనసాగాలని సోనియా గాంధీకి విజ్ఞప్తి చేశారు.

Ahmed Patel criticises dissenters, says Rahul Gandhi should be Congress president

నేటి(అగస్టు 24) సీడబ్ల్యూసీ సమావేశానికి కమిటీలోని శాశ్వత సభ్యులందరితో పాటు ప్రత్యేక అతిథులు కూడా పాల్గొన్నారు. ఉదయం 11గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మొదలైన ఈ సమావేశం ఇప్పటికీ కొనసాగుతోంది. సోనియా అధ్యక్ష పదవిని చేపట్టి ఏడాది పూర్తి కావాల్సి వస్తున్న సందర్భంలో జరుగుతున్న ఈ సమావేశం చివరకు ఏం తేలుస్తుందన్నది ఉత్కంఠను రేకెత్తిస్తోంది.

English summary
Ahmed Patel criticised the dissenters. Referring to Ghulam Nabi Azad, Mukul Wasnik and Anand Sharma, he said they are occupying key posts in the party and should not have written such a letter. He also said that Rahul Gandhi should take over as Congress president immediately.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X