మోడీకి అన్నాడీఎంకే బానిస, అసదుద్దీన్ హాట్ కామెంట్స్
ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ హాట్ కామెంట్స్ చేస్తుంటారు. ఏ అంశంపైనా అయినా సరే తన అభిప్రాయాన్ని నికచ్చిగా చెబుతుంటారు. తమిళనాడు ఎన్నికల సందర్భంగా అన్నాడీఎంకే పరిస్థితిని వివరించారు. ఆ పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి బానిసగా మారిపోయిందని చెప్పారు. దురదృష్టవశాత్తు అన్నాడీఎంకే బానిసగా మారిందని అసద్ గుర్తుచేశారు.
అన్నాడీఎంకే ఎంత మాత్రమూ జయలలిత పార్టీ కాదని అసదుద్దీన్ తెలిపారు. జయలలిత తన పార్టీని బీజేపీకి ఎప్పుడూ దూరంగా ఉంచేదని వ్యాఖ్యానించారు. కానీ ఇప్పుడు మాత్రం మోడీ బానిసగా అన్నాడీఎంకే మారిపోయిందని ఎద్దేవా చేశారు. టీవీవీ దినకరన్తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడాన్ని ఒవైసీ సమర్థించుకున్నారు. బాబ్రీ మసీదు విషయంలో శివసేన కొన్ని వ్యాఖ్యలు చేసింది.. ఆ వ్యాఖ్యలతో డీఎంకే ఇప్పుడు ఏకీభవిస్తుందా? అని అడిగారు.

దినకరన్, తాను బీజేపీకి బీ టీమ్ అంటూ విమర్శిస్తున్నారని.. కానీ డీఎంకే మాత్రం శివసేనను అధికారంలోకి తెచ్చిన కాంగ్రెస్తో చేతులు కలిపిందని గుర్తుచేశారు. తాము ఎన్నికల గోదాలో దిగిన ప్రతిసారీ బీజేపీ లాభపడుతోందని విమర్శిస్తున్నారు. సెక్యులరిజం అంటే ఏమిటో డీఎంకే వివరిస్తుందా? మహారాష్ట్రలో కాంగ్రెస్ శివసేనకు మద్దతిస్తోంది. మరి ఇప్పుడు శివసేన సెక్యులరా? మతతత్వవాదా? డీఎంకే చెప్పాలి అని ఒవైసీ సూటిగా ప్రశ్నించారు.
-
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్పోర్ట్లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
రూపాయి సేఫ్: ఒక్కరోజే భారీ లాభం!












Click it and Unblock the Notifications