సీఎం పళనిసామి అత్యవసర సమావేశం, శశికళను శాశ్వతంగా సాగనంపాలని రహస్య చర్చ !
తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు, ఎంపీలతో రహస్యంగా చర్చిస్తున్నారు.
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు, ఎంపీలతో రహస్యంగా చర్చిస్తున్నారు. అన్నాడీఎంకే పార్టీ రాష్ట్ర, జిల్లా నాయకులను సమావేశానికి దూరం పెట్టి కేవలం ఎమ్మెల్యేలు, ఎంపీలతో మాత్రమే చర్చలు జరుపుతున్నారు.
చెన్నైలోని రాయపేట్ లోని అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యాలయంలో సోమవారం ఉదయం సీఎం పళనిసామి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. రోజురోజుకు దినకరన్ దూకుడు పెంచుతున్న సమయంలో సీఎం పళనిసామి వ్యూహాత్మకంగా పావులుకదుపుతున్నారు.

పార్టీ కార్యవర్గం, సర్వసభ్య సమావేశం ఎప్పుడు నిర్వహించాలి ? అనే విషయంపై చర్చజరుగుతోంది. సెప్టెంబర్ మొదటి వారంలో పార్టీ సర్వసభ్య సమావేశం నిర్వహించాలని చర్చిస్తున్నారని తెలిసింది. శశికళను, టీటీవీ దినకరన్ ను శాశ్వతంగా పార్టీ నుంచి సాగనంపడానికి సీఎం పళనిసామి, పన్నీర్ సెల్వం పావులుకదుపుతున్నారు.
మరో వైపు తానేమి తక్కువ తిన్నానా అంటూ టీటీవీ దినకరన్ ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నారు. అన్నాడీఎంకే పార్టీ కార్యవర్గంలోని 255 మంది, సర్వసభ్యుల్లోని 2,750 మంది సభ్యుల మద్దతుకూడగట్టుకునే పనిలో దినకరన్ బిజిబిజీగా గడుపుతున్నారు. పళనిసామి నేతృత్వంలో జరుగుతున్న సమావేశంలో తమిళనాడు మంత్రులు హాజరైనారు.
-
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు? -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు












Click it and Unblock the Notifications