జయలలిత ఆదేశం: ఎంపీలు మోడీ కార్యాలయం వరకు ర్యాలీ
న్యూఢిల్లీ: కావేరీ జలాల విషయంపై కర్ణాటక ప్రభుత్వ తీరును ఖండిస్తూ తమిళనాడుకు చెందిన అన్నాడీఎంకే పార్లమెంట్ సభ్యులు, రాజ్యసభ సభ్యులు మంగళవారం పార్లమెంట్ భవన్ నుంచి ప్రధాని నరేంద్ర మోడీ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు.
లోక్ సభ డిప్యూటీ స్పీకర్ తంబిదోరై ఆధ్వర్యంలో ర్యాలీగా వెళ్లారు. తరువాత కావేరీ మేనేజ్ మెంట్ బోర్డు ఏర్పాటు చెయ్యాలని ప్రధాని నరేంద్ర మోడీకి వినతి పత్రం సమర్పించారు. అనంతరం లోక్ సభ డిప్యూటీ స్పీకర్ తంబిదోరై మీడియాతో మాట్లాడారు.
ప్రధాని నరేంద్ర మోడీ మా వినతికి సానుకూలంగా స్పంధించారని అన్నారు. త్వరలో కావేరీ మేనేజ్ మెంట్ బోర్డు ఏర్పాటు చేస్తామని ప్రధాని నరేంద్ర మోడీ హామీ ఇచ్చారని ఆయన వివరించారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పార్టీ ఎంపీలు ప్రధాని నరేంద్ర మోడీకి వినతి పత్రం సమర్పించామని అన్నాడీఎంకే పార్టీ ట్విట్టర్ లో తెలిపింది.