సీఎంను కట్రోల్ లో పెట్టండి: శశికళ అక్క కోడుకు టీటీవీ !
చెన్నై: తమిళనాడు మఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామికి చెక్ పెట్టి తన అదుపులోకి తీసుకోవాలని అన్నాడీఎంకే పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ. దినకరన్ ప్రయత్నిస్తున్నారని అన్నాడీఎంకే పార్టీ నాయకులు అంటున్నారు.
అన్నాడీఎంకే నాయకుల కథనం మేరకు తమిళనాడు సీఎం ఎడప్పాడి పళనిసామిని కంట్రోల్ చేసే వార్తలు ప్రసారం చెయ్యాలని జయ టీవీకి దినకరన్ సూచించారని సమాచారం, ఎడప్పాడి పళనిసామిని ఇప్పటి నుంచి అదుపులో పెడితే తనకు కలిసి వచ్చే అవకాశం ఉందని దినకరన్ ప్లాన్ వేశారని సమాచారం.

ఎడప్పాడి పళనిసామి సొంతంగా నిర్ణయాలు తీసుకోకుండా, సీఎం మాట మంత్రులు వినకుండా చూడాలని, తమిళనాడు ప్రజలతో సహ పార్టీకి ఆయన అనుకూలంగా లేరనే ప్రచారం చెయ్యాలని సొంత చానల్ జయ టీవీ ప్రతినిథులకు చెప్పారని శశికళ వర్గంలోని అన్నాడీఎంకే నాయకులు అంటున్నారు.
అన్నాడీఎంకే పార్టీ కార్యక్రమాలు నిర్వహించిన సందర్బాల్లో కూడా ఫ్లెక్సీల్లో సీఎం ఎడప్పాడి పళనిసామి ఫోటోలు లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇప్పుడు ఎడప్పాడి పళనిసామికి వ్యతిరేకంగా కథనాలు ప్రసారం చేస్తే దినకరన్ స్వయంగా ప్రభుత్వం మీద పెత్తనం చెలాయించేలా ప్లాన్ చేస్తున్నారని అన్నాడీఎంకే పార్టీ నాయకులే అంటున్నారు.












Click it and Unblock the Notifications