అసభ్య, అశ్లీల పదజాలం: దీపికా పడుకొనేకు కోర్టు ఊరట
ముంబై: వివాదాస్పద ఏఐబీ రోస్ట్ కార్యక్రమంలో అసభ్య, అశ్లీలకరమైన పదజాలం ఉపయోగించారన్న ఆరోపణలతో నమోదైన కేసులో బాలీవుడ్ బామదీపికా పదుకొనేతోపాటు మరికొందరు ప్రముఖులకు ఊరట లభించింది. ఈ కేసులో దీపికపై కఠిన చర్యలు తీసుకోవద్దని, అరెస్ట్ చేయవద్దని పోలీసులకు జస్టిస్ రంజిత్ మోరే, అనుజా ప్రదుదేశాయ్లతో కూడిన బాంబే హైకోర్టు ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది.
తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలని దీపికా పదుకొనే ఈ నెల రెండో తేదీన బొంబాయి హైకోర్టులో పిటిషన్ దాఖలుచేశారు. ఈ నేపథ్యంలో మార్చి 16 వరకు అంటే పిటిషన్పై విచారణ చేపట్టే రోజు వరకు ఆమెను అరెస్ట్ చేయవద్దని పోలీసులకు కోర్టు ఆదేశాలు జారీచేసింది. నిరుడు చివర్లో ముంబైలో నిర్వహించిన ఈ కార్యక్రమంపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి.

ఈ వ్యవహారంలో దీపికతోపాటు బాలీవుడ్ ప్రముఖులు కరణ్ జోహార్, అర్జున్కపూర్, రణవీర్సింగ్, ఇతరులపై కేసు నమోదుచేశారు. దీపికా పడుకొనేకు లభించిన ఊరటనే ఇంతకు ముదు అర్జన్ కపూర్, రణవీర్ కపూర్లకు లభించింది.
సంతోష్ దౌంద్కర్ అనే సామాజిక కార్యకర్త చేసిన ఫిర్యాదు మేరకు ముంబై పోలీసులు ఆ ఎఎఫ్ఐర్ నమోదు చేశారు. కోర్టు ముంబై, పూణేలకు సంబంధించిన రెండు కేసులను కలిపి విచారణకు చేపట్టింది. టార్డియో పోలీసులు 14 మందిపై కేసు నమోదు చేశారు.
-
బాలీవుడ్ సూపర్ స్టార్ సరసన సమంత? -
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
తెలుగు హీరోయిన్తో స్టార్ క్రికెటర్ ఎంగేజ్మెంట్! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్












Click it and Unblock the Notifications