కాంగ్రెస్, ఎన్సీపీకి మజ్లిస్ పోటు- జోరుగా ఎగిరిన గాలి పటం
అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని అఖిల భారత మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) మహారాష్ట్ర మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో ఊహించని విజయం సాధించింది. ఈ మధ్యాహ్నం 2 గంటల నాటికి రాష్ట్రవ్యాప్తంగా 75 స్థానాల్లో ముందంజలో కనిపించింది. ముస్లిం, దళిత ఓటర్లలో తన ప్రభావాన్ని పెంచుకుంది. ఓటుబ్యాంకును గణనీయంగా మెరుగుపర్చుకోగలిగింది. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ సహా ముస్లింల ప్రాబల్యం అధికంగా ఉన్న చోట్ల జెండా పాతింది.
అహిల్యానగర్, చంద్రపూర్ మున్సిపల్ కార్పొరేషన్లలో తన ఉనికిని చాటుకుంది. ఈ రెండు చోట్లా తన ఖాతా తెరిచింది ఎంఐఎం. ఈ రెండు మున్సిపాలిటీల్లో మజ్లిస్ గెలవడం అనేది ఇంతకుముందెప్పుడూ జరగలేదు. ఇదే తొలిసారి. అహిల్యానగర్లో 3, చంద్రపూర్లో ఒక వార్డులో విజయాన్ని అందుకుంది. మహారాష్ట్రవ్యాప్తంగా కూడా కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ (శరద్ పవార్)కు చెందిన సంప్రదాయ ఓటుబ్యాంకును భారీగా చీల్చిందనే అంచనాలు ఉన్నాయి.

ముంబైలోనూ ఏఐఎంఐఎం తన పట్టును మరింత పెంచుకుంది. దేశంలోనే అత్యంత ధనిక సివిక్ బాడీ.. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ 2017లో ఈ పార్టీకి రెండు స్థానాలే ఉండగా.. ఇప్పుడు ఈ సంఖ్య రెట్టింపు అయింది. దీంతో ఏఐఎంఐఎం గ్రూప్ లీడర్గా బీఎంసీలో కార్యాలయ కేటాయింపునకు అర్హత సాధిస్తుందని ఫ్రీ ప్రెస్ జర్నల్ వెల్లడించింది.
ముంబై వార్డు నంబర్ 134లో ఏఐఎంఐఎం అభ్యర్థి మెహజబీన్ అతీక్ అహ్మద్ 8,414 ఓట్లు సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి బెంజీర్ దివాతేను 2,216 ఓట్ల తేడాతో ఓడించారు. అలాగే- వార్డు నంబర్ 136లో మజ్లిస్ అభ్యర్థి జమీర్ ఖురేషి.. తన సమీప ప్రత్యర్థి సమాజ్వాదీ పార్టీకి చెందిన అభ్యర్థిపై 9,957 ఓట్ల భారీ మెజారిటీ సాధించారు. వార్డు నంబర్ 137లో కూడా ఇదే పరిస్థితి కనిపించింది. ఇక్కడి నుంచి పోటీ చేసిన పటేల్ షమీర్ 4,370 ఓట్లు, వార్డు నంబర్ 145లో ఖైరునిసా అక్బర్ హుస్సేన్- 2,095 ఓట్ల తేడాతో విజయం సాధించారు.
ఛత్రపతి శంభాజీనగర్ (ఔరంగాబాద్) మున్సిపల్ కార్పొరేషన్లోనూ పలు స్థానాల్లో ఏఐఎంఐఎం ఆధిక్యత చూపింది. మలేగావ్లో 20, నాందేడ్లో 14, అమరావతిలో ఆరు స్థానాలు గెలుచుకుంది. పర్బాణిలో కాంగ్రెస్ విజేతలు అధికార బీజేపీ, శివసేన, ఎన్సీపీలతో చేతులు కలుపుతారని అసదుద్దీన్ ఒవైసీ తన ప్రచార సభల్లో ఆరోపించారు. ఇది సత్ఫలితాలను ఇచ్చినట్టయింది. కాంగ్రెస్ అభ్యర్థులు ఇక్కడ మజ్లిస్ చేతిలో ఓడిపోయారు.
-
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్












Click it and Unblock the Notifications