Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఎయిర్ ఇండియా: ప్రయాణికుడి భోజనంలో బల్లి

న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణిస్తున్న ప్రయాణికుడికి ఇచ్చిన భోజనంలో బల్లి పడిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ దెబ్బతో ఎయిర్ ఇండియా మీద ఇంకోక సారి ఆరోపణలు రావడంతో అధికారులు సతమతం అయ్యారు.

ఆలస్యంగా వెలుగు చూసిన ఈ సంఘటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. గురువారం ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి ఎయిర్ ఇండియా విమానం ఎఐ 111 లండన్ బయలుదేరింది. తరువాత అందులో ప్రయాణిస్తున్న వ్యక్తికి సిబ్బంది భోజనం ఇచ్చారు.

Air India Delhi-Landan flight, passenger gets lizard in meal

ఆహారం ఇచ్చిన ట్రేలో బల్లి కనిపించింది. షాక్ కు గురైన ఆ వ్యక్తి ఎయిర్ ఇండియా సిబ్బందిని పిలిచి బల్లి పడిందని ప్లేట్ వేరే ఇవ్వాలని చెప్పాడు. అయితే సిబ్బంది మాత్రం వేరే ప్లేట్ ఇవ్వడానికి నిరాకరించారని, తనతో దురుసుగా ప్రవర్తించారని ప్రయాణికుడు ఆరోపించారు.

ఈ విషయంపై తాను ఎయిర్ ఇండియాకు ఫిర్యాదు చేస్తానని ప్రయాణికుడు అన్నారు. అయితే ఎయిర్ ఇండియా వాదన మరో విధంగా ఉంది. ప్రయాణికుడికి ఇచ్చిన భోజనం లో బల్లి లేదని, ఆ అవకాశం లేదని అంటున్నారు. తమకు ఎవ్వరు కూడా ఫిర్యాదు చెయ్యలేదని ఎయిర్ ఇండియా అధికారులు అంటున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+