‘‘నేనేం విలన్ కాదు.. మీకు తెలిసింది కొంతే.. అసలేం జరిగిందో అక్కడ వెల్లడిస్తా..’’
శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ త్వరలోనే తన దురుసు ప్రవర్తనపై పార్లమెంట్ లో వివరణ ఇచ్చుకోబోతున్నారు.
న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియా మేనేజర్ పై చేయి చేసుకుని, నిషేధానికి గురై, విమాన ప్రయాణానికి దూరమైన శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ త్వరలో ఈ ఉదంతం గురించి వివరణ ఇచ్చుకోబోతున్నారు.
వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ఆయన తన చర్యను గట్టిగా సమర్థించుకునేందుకు సమాయత్తమవుతున్నారు. అసలు తీను చేయి చేసుకోవడానికి దారితీసిన కారణాలు, ఆ తరువాత జరిగిన పరిణామాలను ఆయన లోక్ సభలో వివరించే అవకాశం ఉన్నట్లు అత్యంత సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తోంది.

జరిగినదంతా తొలుత లోక్ సభలో వివరించిన తరువాతనే రవీంద్ర గైక్వాడ్ మీడియాను కలిసి మరోసారి వివరణ ఇస్తారని ఎంపీ సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి. తానేమీ విలన్ కాదని, ఇప్పటి వరకు అందరికీ తెలిసింది ఒకవైపు కథ మాత్రమేనని, తెలియాల్సింది చాలా ఉందని, అది పార్లమెంటులోనే వెల్లడిస్తానని మీడియాతో ఆయన వ్యాఖ్యానించారట.
ఎయిర్ ఇండియా విమానంలోకి ఎక్కిన రవీంద్ర గైక్వాడ్ ఆ సంస్థ మేనేజర్ తో గొడవపడి ఆయన్ని 25 సార్లు చెప్పుతో కొట్టినట్లు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఆ మేనేజర్ ఎయిర్ ఇండియాకు ఫిర్యాదు చేయడంతో ఇప్పటికి నాలుగుసార్లు రవీంద్ర గైక్వాడ్ విమానంలో ప్రయాణించకుండా ఆ సంస్థ చర్యలు తీసుకుంది.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications